‘వైసీపీ అధినేత, సీఎం జగన్ అప్పాయింట్మెంట్ దొరకడం లేదు! ఏం చేయమంటారు?’ ఇదీ.. ఇప్పటి వరకు.. పార్టీ నేతలు.. నాయకులు.. ఎమ్మెల్యేలు , కొందరు ఎంపీలు చెబుతున్న మాట. తమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని.. అయితే.. జగన్ తమకు అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. వారు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పరిస్థితి నిజమే. కొందరికి మాత్రమే.. జగన్ అప్పాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆ కొందరిలోనూ.. అత్యంత కీలకమైన వారికి మాత్రమే జగన్ దర్శనం దొరుకుతోంది.
పోనీ.. ఎక్కడైనా బహిరంగ సభల్లో అయినా.. ఆయన పాల్గొంటే.. ఎక్కడొ ఒకచోట ఒక నిముషం సమయం కేటాయించుకుని.. ఆయనకు తమ బాధను వెల్లడించాలని కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, అది కూడా జగన్ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆయన ఎక్కడా పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో నాయకులకు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తమసమస్యలు చెప్పుకొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ విషయంపై వారు గుర్రుగా ఉన్నారు. సలహాదారు సజ్జలకు కూడా ఇదే విషయాన్ని వారు తేల్చి చెబుతున్నారు. సార్ ఇలా అయితే.. ఎలా? అంటూ.. ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో ఇన్నాళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో.. త్వరలోనే వారానికి రెండు సార్లు.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ సమావేశం అయ్యేలా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రతి వారం.. కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్లు ఇవ్వాలని.. జగన్ నిర్ణయించుకున్నట్టు సీఎంవో వర్గాలు కూడా చెబుతున్నాయి.
తొలి దశలో టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్న నియోజకవర్గాలకు ప్రాధా న్యం ఉంటుందని.. రోజుకు 5 నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారని.. చెబుతున్నారు. కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 నిముషాల సమయం ఇవ్వనున్నారని అంటున్నారు. వారి సమస్యలు వినడం.. పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తారని.. చెబుతున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 17, 2021 9:34 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…