వైసీపీలో రాజకీయాలు ఇప్పుడున్నట్టుగా.. వచ్చే ఎన్నికల సమయానికి ఉండవనేది ప్రతి ఒక్కరి మాట. ఇది పార్టీలోనూ హల్చల్ చేస్తోంది. ఎవరిని కదిపినా.. వచ్చే ఎన్నికల నాటికి.. ఏం జరుగుతోందో ? అనే చర్చ చేస్తున్నారు. కొందరు ఏకంగా మాకు టికెట్ కూడా దక్కుతుందని అనుకోవడం లేదు.. అనేస్తున్నారు. దీనికి వారేదో తప్పులు చేస్తున్నారని కాదు.. వారిపై వ్యతిరేకత వస్తుందని కూడా కాదు. వైసీపీ అధిష్టానం దృష్టి వేరేగా ఉండడమే..! దీంతో నాయకులు ఏ ఇద్దరు కలిసినా.. నీ ఇలాకాలో ఏం జరుగుతోంది ? ప్లస్సా.. మైనస్సా.. అనే చర్చ చేస్తున్నారు. అంతేకాదు.. నిఘాపైనా చర్చించుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజానాడితో పాటు.. నియోజకవర్గాల్లో పరిస్థితి. సామాజిక వర్గాల సమీకరణలు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే నియోజకవర్గాలపై నిఘా పెట్టారు. అది ప్రశాంత్ కిశోర్ టీం అని పైకి ప్రచారం ఉన్నప్పటికీ.. వలంటీర్లే.. నిఘాగా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో వలంటీర్ల విషయంలో ఒకప్పుడు జోక్యం చేసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.
ఎందుకంటే.. తామేమన్నా.. జోక్యం చేసుకుంటే.. నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారేమో ? అనివారు మదన పడుతు న్నారు. దీంతో ఇప్పుడు వలంటీర్లదే రాష్ట్రంలో ఆధిపత్యం అనేలా పరిస్థితి నడుస్తోంది. ఎక్కడికక్కడ వలంటీర్లు చెప్పినట్టే నడుస్తోందట. దీంతో ఎమ్మెల్యేల మాట కన్నా.. ప్రజలు వలంటీర్లకే తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. తమకు అందుబాటులో ఉంటున్నవారినే.. ఎమ్మెల్యేలుగా భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చర్యల వల్ల ఎమ్మెల్యేలు ప్రజల్లో డమ్మీలు అయిపోతున్నారు.
ఈ పరిస్థితిని ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు.. జిల్లా ఇంచార్జ్ మంత్రులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వారు కూడా అధిష్టానం ఆదేశాలు ఎలా ఉంటే అలాగే జరుగుతుందని.. తమ ప్రమేయం ఏమీ లేదేని.. చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు.. ఎమ్మెల్యేలు కూడా వలంటీర్లంటే.. వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on November 9, 2021 9:39 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…