Political News

ఆయ‌న‌తో 30 ఏళ్ల వైరం.. బాబు గెలిచి నిలుస్తారా ?

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును చివ‌ర‌కు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేత‌లు. గ‌త ఎన్నిక‌ల్లోనే బాబు కుప్పంలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌లు, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప ఇద్ద‌రూ కూడా కుప్పంపై బాగా ఫోక‌స్ చేసి టీడీపీకి సీన్ లేకుండా చేశారు.

ఇక ఇప్పుడు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లపై కూడా పెద్దిరెడ్డి బాగా ఫోక‌స్ చేశారు. ఆయ‌న అక్క‌డే మ‌కాం వేసి కుప్పం మున్సిపాల్టీపై తొలిసారే వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేలా చేయాల‌ని ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. పెద్దిరెడ్డి కాక చంద్ర‌బాబుకు చేరింది. అందుకే ఆయ‌న కుప్పం కోట కూలిపోతోంద‌ని భావించే మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాకుండానే కుప్పంలో వాలిపోయి ప్ర‌చారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుప్పానే టార్గెట్ చేయ‌డంతో బాబు ఇప్పుడు పెద్దిరెడ్డి ఇలాకా అయిన పుంగ‌నూరును టార్గెట్ చేసే ప‌ని స్టార్ట్ చేశారు.

పెద్దిరెడ్డిని పుంగ‌నూరులో కంట్రోల్ చేయ‌క‌పోతే ఆయ‌న త‌న కుప్పం సీటుకు ఎర్త్ పెట్టేశాలా ఉన్నాడ‌న్న విష‌యం బాబుకు కాస్త లేట్‌గా అర్థ‌మైంది. పెద్దిరెడ్డి కుప్పంలో బాబు గెలిస్తే తాను రిటైర్మెంట్ తీసుకుంటాన‌ని మ‌రీ స‌వాల్ కూడా చేశారు. దీంతో కుప్పం ప‌ర్య‌ట‌న‌లో బాబు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఈ సారి పెద్దిరెడ్డి పుంగ‌నూరులో ఎలా గెలుస్తారో ? చూస్తాన‌ని ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇందుకు స్పెష‌ల్ ఆప‌రేష‌న్ కూడా స్టార్ట్ చేశారు.

పుంగనూరులో పార్టీ బాధ్య‌త‌ల‌ను బాబు ఏకంగా ముగ్గురు నేత‌ల‌కు అప్ప‌గించారు. నియోజ‌క‌వ‌ర్గానికి చ‌ల్లా రామ‌చంద్రారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. బాబుతో పాటు అక్క‌డ కేడ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను టీడీపీ సీనియర్‌ నేతలు అమర్నాథ్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఈ ముగ్గురు కలిసి పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నిద్ర‌లేకుండా చేయాల‌ని ఆదేశించార‌ట‌. ఏదేమైనా పెద్దిరెడ్డి, చంద్ర‌బాబుది 30 ఏళ్ల వైరం. ఈ వైరం నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పై చేయి సాధిస్తారో ? చూడాలి.

This post was last modified on November 8, 2021 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago