పంజాబ్లో అధికార పార్టీ కాంగ్రెస్కు కాస్త ఉపశమనం కలిగినట్లేనని చెప్పాలి. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళన రేకెత్తించాయి. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూతో మొదలైన విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. చివరకు అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చరణ్జీత్ సింగ్ చన్నీని అధిష్ఠానం ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. దీంతో సమస్య సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం కలకలం రేపింది. చరణ్జీత్ సారథ్యంలోని కొత్త కేబినేట్ శాఖల కేటాయింపుపై అసంతృప్తి ఇతర కారణాలతో సిద్దూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
సిద్ధూ రాజీనామాను ఆమోదించని అధిష్టానం ఆయనతో మాట్లాడి సర్దిచెప్పింది. దీంతో తాజాగా తాను రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సిద్ధూ ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. కానీ ఇక్కడో ఓ మెళిక పెట్టారు. కొన్ని షరతులు విధించిన ఆయన తన పంతం నెగ్గించుకునే దిశగా సాగుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్వకేట్ జనరల్, డీజీపీ నియామకం తర్వాతే తాను తిరిగి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటానని సిద్ధూ పక్కాగా తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా పంజాబీల ప్రయోజనం కోసమేనని సీఎం చరణ్జీత్తో తనకెలాంటి విభేదాలు లేవని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్పైనా విమర్శలు చేశారు. గతంలో సీఎంగా ఉన్న అమరీందర్ అధికారులను తన చేతుల్లో పెట్టుకుని పనులు చేయడంలో విఫలమయ్యారని సిద్దూ విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించిన సిద్ధూ అందుకు షరతలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ అడ్వకేట్ జనరల్గా ఉన్న ఏపీఎస్ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీపీపీ సుమేధ్ సైనీ తరపున వాదించిన డియోల్ను ఇప్పుడు ఏపీగా నియమించడాన్ని సిద్ధూ వ్యతిరేకిస్తున్నారు. అంతే కాకుండా డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సిద్దూ ఆరోపణల నేపథ్యంలో ఏజీ పదవికి డియోల్ రాజీనామా లేఖను సీఎంకు పంపినట్లు తెలిసింది. దాన్ని సీఎం చరణ్జీత్ తిరస్కరించినట్లు సమాచారం.
This post was last modified on November 8, 2021 11:27 am
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం…
ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని…
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…