Political News

పాద‌యాత్ర‌పై.. ఎందుకీ యాగీ.. ఏం జ‌రిగింది?

రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌నే ల‌క్ష్యంతో ఇక్క‌డి రైతులు.. మ‌హిళ‌లు.. రెండు సంవ‌త్స రాలకు పైగానే ఆందోళ‌న చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళ‌న చేసిన‌.. ఇక్క‌డి ప్ర‌జ‌లు.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు త‌మ వాదాన్ని.. నినాదాన్ని వినిపించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు అనే పేరుతో మ‌హాపాద‌యాత్రను ప్రారంభించారు. ప్ర‌స్తుతం 7వ రోజుకు చేరుకున్న ఈ పాద‌యాత్ర కు అక‌స్మాత్తుగా.. పోలీసుల నుంచి నోటీసులు అందాయి. హైకోర్టు నిబంధ‌న‌లను.. సూచ‌న‌ల‌ను ఉల్లంఘిం చార‌ని పేర్కొన్నారు.

అయితే.. వాస్త‌వానికి పాద‌యాత్ర‌లో ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ప్ర‌భుత్వానికి కానీ, పోలీసుల కు కానీ.. అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర చేయ‌డం సుత‌రామూ ఇష్టం లేద‌న్న విష‌యం ఆది నుంచి అంద‌రికీ గుర్తే. పాద‌యాత్ర‌కు అనుమ‌తి కోరిన‌ప్పుడే.. డీజీపీ స‌వాంగ్ వెనుకా ముందు కూడా ఆలోచించు కోకుండా.. నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అయితే.. దీనిపై హైకోర్టుకు వెళ్లిన అన్న‌దాత‌లు.. అనుమ‌తులు తెచ్చుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో 200 లోపు పాద‌యాత్ర చేసుకుంటామ‌న్న అన్న‌దాత‌ల విజ్ఞ‌ప్తిపై హైకోర్టు 157కు ప‌రిమితం చేసింది.

అదేస‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు విధించింది. వీటిని రైతులు పాటిస్తున్నారు. అమ‌లు చేస్తున్నారు. అయితే.. రాజ‌ధానిపై ఉన్న మ‌మ‌కారం కావొచ్చు.. రాజ‌ధానితో పెన‌వేసుకున్న బంధం వ‌ల్ల కావొచ్చు.. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. నిక‌రంగా చూస్తే.. పాద‌యాత్ర క‌మిటీ కేవ‌లం 160 పాసుల‌ను జారీ చేసింది. కానీ, యాత్ర‌కు మ‌ధ్య‌లో చేరేవారు.. కొద్దిసేపు పాదం క‌దిపి.. మ‌ళ్లీ వెళ్లిపోయేవారు.. స‌హ‌జం. అది ఎలాంటి యాత్ర అయినా.. అభిమానులు పోటెత్తుతారు. అయితే.. వారిని నిక‌ర సంఖ్య‌గా చూపించే ప‌రిస్థితి ఉండ‌దు.

ఇక‌, డీజే సిస్టం వ‌ద్ద‌ని హైకోర్టు చెప్పింది. దీంతో పాద‌యాత్ర‌లో మేళ‌తాళాలు, సంప్ర‌దాయ‌ డ‌ప్పులు వినియోగిస్తున్నారు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ఇక‌, రాజ‌కీయ ప్ర‌సంగాల‌కు దూర‌మ‌న్నారు. ఇదీ.. జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. నిబంధ‌న‌ల పేరిట ఎందుకు యాగీ చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక్క‌డ ఒక ఉదాహ‌ర‌ణ చెప్పుకొంటే.. ఇలాంటి సంద‌ర్భాల్లో.. చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాల్సిన .. పోలీసులు కానీ.. అధికారులు కానీ.. ప్ర‌తి విష‌యాన్నీ ప‌ట్టించుకోవ‌డం.

ఇక‌, ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. వైసీపీ నేత‌లు.. రాజ‌ధాని.. సెంటిమెంట్ .. కేవ‌లం.. నాలుగు మండ‌లాల‌కు, ఆయా గ్రామాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని.. అదేస‌మ‌యంలో ఒక సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని.. చెప్పుకొంటూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు పాద‌యాత్ర‌కు మాత్రం.. పొరుగు జిల్లాల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం.. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగ ప్ర‌జ‌లు పాల్గొన‌డం.. వంటివి.. స‌హ‌జంగానే వైసీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తున్న‌దనేది.. వాస్త‌వం అంటున్నారు రైతులు. ఏదేమైనా.. పాద‌యాత్ర ను మ‌ధ్య‌లోనే ఆప‌డం స‌మంజ‌సం కాద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on November 7, 2021 1:34 pm

Share

Recent Posts

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

3 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

4 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

6 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

7 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

7 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

7 hours ago