Political News

చాహల్‌పై నోరు జారిన యువీ.. పోలీస్ కేస్ నమోదు

కొన్నిసార్లు సరదాగా అనే మాటలే చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. కేసుల వరకు తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అలాంటి మాటతోనే వివాదంలో చిక్కుకున్నాడు. పోలీస్ కేసు ఎదుర్కొంటున్నాడు.

అతను తన మాజీ సహచరుడు, స్నేహితుడు అయిన టీమ్ ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఉద్దేశించి ఓ ఆన్ లైన్ చాట్ కార్యక్రమంలో ఉపయోగించిన ‘భాంగి’ అనే పదం వివాదానికి దారి తీసింది. ఆ పదం దళితుల్ని కించపరచడానికి ఉపయోగిస్తారని.. చాహల్‌ను ఉద్దేశించి ఆ పదం వాడటం ద్వారా తమ కులాన్ని అతను కించపరిచాడని హరియాణాకు చెందిన దళిత హక్కుల నేత, న్యాయవాది రజత్ కలశన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇటీవల యువరాజ్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ప్రోగ్రాం నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్‌ల గురించి మాట్లాడాడు. అందులో భాగంగా చాహల్‌ గురించి స్పందిస్తూ ‘భాంగి’ అనే పదాన్ని వాడాడు యువీ. దీనికి బదులుగా రోహిత్ శర్మ నవ్వాడు. అది ట్విట్టర్లో వివాదంగా మారింది. యువీ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడంటూ అతణ్ని ట్రోల్ చేశారు.

దీనిపై ఇప్పుడు దళిత హక్కుల నేత రజత్ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువీ తప్పు మాట మాట్లాడాడని.. రోహిత్ శర్మ దాన్ని ఖండించకుండా నవ్వాడని.. ఇది దళితుల సెంటిమెంటును గాయపరిచిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ చర్చకు సంబంధించిన సీడీలు, వివరాలను పోలీసులకు ఆయన అందేశారు. ఈ కేసు విచారణను డీఎస్‌పీకి అప్పగించామని.. యువీ తప్పు చేశాడని తేలితే తగు చర్యలు చేపడతామని హన్సి ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు.

This post was last modified on June 5, 2020 12:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Yuvraj Singh

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago