కొన్నిసార్లు సరదాగా అనే మాటలే చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. కేసుల వరకు తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అలాంటి మాటతోనే వివాదంలో చిక్కుకున్నాడు. పోలీస్ కేసు ఎదుర్కొంటున్నాడు.
అతను తన మాజీ సహచరుడు, స్నేహితుడు అయిన టీమ్ ఇండియా స్పిన్నర్ చాహల్ను ఉద్దేశించి ఓ ఆన్ లైన్ చాట్ కార్యక్రమంలో ఉపయోగించిన ‘భాంగి’ అనే పదం వివాదానికి దారి తీసింది. ఆ పదం దళితుల్ని కించపరచడానికి ఉపయోగిస్తారని.. చాహల్ను ఉద్దేశించి ఆ పదం వాడటం ద్వారా తమ కులాన్ని అతను కించపరిచాడని హరియాణాకు చెందిన దళిత హక్కుల నేత, న్యాయవాది రజత్ కలశన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల యువరాజ్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్రోగ్రాం నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ల గురించి మాట్లాడాడు. అందులో భాగంగా చాహల్ గురించి స్పందిస్తూ ‘భాంగి’ అనే పదాన్ని వాడాడు యువీ. దీనికి బదులుగా రోహిత్ శర్మ నవ్వాడు. అది ట్విట్టర్లో వివాదంగా మారింది. యువీ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడంటూ అతణ్ని ట్రోల్ చేశారు.
దీనిపై ఇప్పుడు దళిత హక్కుల నేత రజత్ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువీ తప్పు మాట మాట్లాడాడని.. రోహిత్ శర్మ దాన్ని ఖండించకుండా నవ్వాడని.. ఇది దళితుల సెంటిమెంటును గాయపరిచిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ చర్చకు సంబంధించిన సీడీలు, వివరాలను పోలీసులకు ఆయన అందేశారు. ఈ కేసు విచారణను డీఎస్పీకి అప్పగించామని.. యువీ తప్పు చేశాడని తేలితే తగు చర్యలు చేపడతామని హన్సి ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు.
This post was last modified on June 5, 2020 12:21 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…