క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎంతో ప్రిస్టేజియస్ గా తీసుకున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవటమే కేసీయార్ కు పెద్ద దెబ్బ. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టాలని ప్రలోభాలు, ఒత్తిళ్ళు, బదిలీలు, పంపిణీలు, పదవులు, పథకాలు ఎన్ని ప్రకటించినా చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. అంటే కేసీయార్ మాటలను జనాలు నమ్మటం మానేయటమే కాకుండా తమలోని వ్యతిరేకతను ఈటలను గెలిపించటం ద్వారా స్పష్టం చేసినట్లు అర్ధమవుతోంది.
ఇంకా ఓటమి బాధనుండే బయటపడలేక నానా అవస్తలు పడుతుంటే ఉద్యోగాల భర్తీకి ఉద్యమం పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే పెద్ద ఉద్యమం మొదలవ్వబోతోంది. 20 విద్యార్ధి సంఘాలు ఉద్యోగాల భర్తీకి పెద్ద ఉద్యమం చేయాలని చేతులు కలిపి జాయింట్ యాక్షన్ కమిటిగా ఫాం అయ్యాయి. ఉద్యమాలకు తెలంగాణాలో ఉస్మానియా విశ్వవిద్యాలయమే కేంద్రమని అందరికీ తెలిసిందే.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి కూడా ఊపు తెచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయమే. కేసీయార్ నిరాహార దీక్షను విరమించి మళ్ళీ వెంటనే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ముందు దీక్షను విరమించి తర్వాత వెంటనే మొదలుపెట్టడంలో ఉస్మానియా విద్యార్ధుల స్పందనే ప్రధాన కారణం. అందుకనే రాజకీయ నేతలకు ఓయూ అంటేనే హడలని చెప్పాలి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రయిన ఏడేళ్ళల్లో కేసీయార్ ఒక్కసారి కూడా ఉస్మానియా క్యాంపస్ లోకి వెళ్ళలేదు.
ప్రభుత్వానికి ఒక విధంగా టెర్రర్ గా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే ఉద్యమం మొదలవ్వబోతోంది. నిరుద్యోగ సైరన్ కు విద్యార్ధిసంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఉద్యోగల భర్తీపై కేసీయార్ నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని విద్యార్ధి సంఘాల సమావేశం తాజాగా నిర్ణయించాయి. అప్పట్లో తెలంగాణా కోసం యావత్ విద్యార్ధి లోకం ఎలా స్పందించిందో ఇపుడు కేసీయార్ ను గద్దె దింపటం కోసం ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటి ప్రకటించింది.
ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీకి కేసీయార్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని ఎదురుచూసిన వారికి నిరాసే ఎదురయ్యింది. అసలు తెలంగాణా ఉద్యమం మొదలైందే నీళ్ళు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నినాదాలపై. నీళ్ళు, ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు నియామకాలు మాత్రం గాలికిపోయాయని విద్యార్ధి సంఘాలు మండిపోతున్నాయి. కేసీయార్ అధికారంలో ఉన్నంతవరకు ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని విద్యార్ధిసంఘాలు ఇఫ్పటికే డిసైడ్ అయిపోయాయి. అందుకనే కేసీయార్ ను గద్దె దింపటమే ఏకైక టార్గెట్ గా ఉద్యమం మొదలవ్వబోతోంది. జరుగుతున్నది చూస్తుంటే కేసీయార్ కు బ్యాడ్ టైం స్టార్టయ్యిందా అనే అనుమానం మొదలవుతోంది.
This post was last modified on November 6, 2021 12:06 pm
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…