Political News

మోడీకి అమెరికా షాక్

పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగం ఆరోపణలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న నరేంద్ర మోడీకి అమెరికా పెద్ద షాకే ఇచ్చింది. తమ దేశంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ కారణంగా మానవ హక్కులకు భంగం కలుగుతున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జర్నలిస్టులు, ప్రతిపక్షాల నేతలు, జడ్జీలు, ఇతర రంగాల్లో నిపుణులు, సామాజిక హక్కుల కార్యకర్తలపై దాదాపు 50 దేశాల్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వాళ్ళ మొబైల్ ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ సాఫ్ట్ వేర్ వినియోగంపై అమెరికా సహా అనేక దేశాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. సరిగ్గా ఇలాంటి ఆరోపణలే నరేంద్ర మోడి సర్కార్ మీద కూడా మొదలైంది. ప్రతిపక్షాల ఆరోపణలకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పలేకపోవటంతో పోయినసారి పార్లమెంటు సమావేశాలు మొత్తం ఈ గొడవతోనే సరిపోయింది. దీంతో కొందరు జర్నలిస్టులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. కేసు విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులిస్తే సరైన సమాధానం చెప్పలేదు.

కేంద్రానికి ఎంత గడువిచ్చినా ఉపయోగం లేకపోవటంతో చివరకు చేసేది లేక పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై సుప్రీంకోర్టు సొంతంగా నిపుణుల కమిటిని నియమించింది. ఈ కమిటి వేయటం నిజానికి కేంద్రానికి ఏమాత్రం ఇష్టంలేదని అర్ధమవుతునే ఉంది. అయినా చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై నిషేధం విధించడం మోడీ సర్కార్ కు చాలా ఇబ్బందిగా మారింది.

ఒకవైపు అమెరికా సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిషేధించటం, ఇదే సమయంలో సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీ విచారణ మొదలుపెట్టడంతో మోడి సర్కార్ కు ఇబ్బందులు మొదలైనట్లే. ఎందుకంటే ఈ కమిటి తన దర్యాప్తులో భాగంగా హోంశాఖ, విదేశాంగ శాఖ, రక్షణ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులను విచారించనున్నది. పైగా ఇదే సమయంలో 50 దేశాల్లో సాఫ్ట్ వేర్ వినియోగంపై పెద్ద దుమారం రేగటమంటే మామూలు విషయం కాదు.

సాఫ్ట్ వేర్ ను ఇండియాలో వినియోగిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా అంగీకరించకపోయినా సాఫ్ట్ వేర్ వినియోగిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించినట్లే. ఎందుకంటే కొందరు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ తో పాటు నిపుణుల పర్యవేక్షణలో నిరూపణైంది. దీంతో స్వతంత్ర కమిటీ దర్యాప్తులో కూడా కొద్దిరోజుల తర్వాత ఇదే విషయం బయటపడటం ఖాయం. అప్పుడు ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు మోడి ఏమని సమాధానం చెప్పుకుంటారో చూడాలి.

This post was last modified on November 5, 2021 8:40 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

5 minutes ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

4 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

6 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

11 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

11 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

12 hours ago