అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ఏ స్థితిలోనూ వెనక్కి తగ్గే రకం కాదు. కింద పడ్డా తనదే పైచేయి అంటాడు. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడతాడు. దూకుడుగానే వ్యవహరిస్తాడు. అలాంటి వ్యక్తి అమెరికాలో నల్ల జాతీయుల నిరసనలకు భయపడి వైట్ హౌస్ను ఖాళీ చేసి దానికి అనుబంధంగా ఉన్న బంకర్లో దాక్కున్నట్లుగా వార్తలు వచ్చాయి. అమెరికా అధికార వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వైట్ హౌస్కు అతి సమీపంలో ఆందోళనలు జరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా భద్రత అధికారులు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని బంకర్లోకి తీసుకెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇలా బంకర్లోకి వెళ్లడం మామూలే.
ఐతే ట్రంప్ ఇలా బంకర్లోకి వెళ్లిన విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. తాను బంకర్లోకి వెళ్లిన మాట వాస్తవమే అంటూనే.. అక్కడికి వెళ్లింది దాక్కోవడం కోసం మాత్రం కాదని చెప్పాడు. ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. నేను బంకర్లోకి వెళ్లడం గురించి ఏమేం రాశారో మీడియాలో చదివాను. బంకర్ను పరిశీలించడానికే వెళ్లాను. దాక్కోవడానికి కాదు. అక్కడికి వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అమెరికా అధ్యక్షుడినైన నా దగ్గరికి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ఓ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో శ్వేత సౌధంపై జరిగే దాడుల నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ రక్షించేందుకు ఈ బంకర్ను నిర్మించారు. ఇది శ్వేత సౌధంలో ఎక్కడ ఉందనే విషయం సీక్రెట్. వైట్హౌస్ మిలటరీ ఆఫీస్ సిబ్బంది దీని నిర్వహణ చూస్తుంటారు. 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్పై దాడులు జరిగిన సమయంలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ఇందులో తలదాచుకున్నారట. ఆ తర్వాత బంకర్ను ఉపయోగించింది ట్రంప్యే అంటున్నారు.
This post was last modified on June 5, 2020 2:16 am
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…