అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ఏ స్థితిలోనూ వెనక్కి తగ్గే రకం కాదు. కింద పడ్డా తనదే పైచేయి అంటాడు. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడతాడు. దూకుడుగానే వ్యవహరిస్తాడు. అలాంటి వ్యక్తి అమెరికాలో నల్ల జాతీయుల నిరసనలకు భయపడి వైట్ హౌస్ను ఖాళీ చేసి దానికి అనుబంధంగా ఉన్న బంకర్లో దాక్కున్నట్లుగా వార్తలు వచ్చాయి. అమెరికా అధికార వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వైట్ హౌస్కు అతి సమీపంలో ఆందోళనలు జరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా భద్రత అధికారులు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని బంకర్లోకి తీసుకెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇలా బంకర్లోకి వెళ్లడం మామూలే.
ఐతే ట్రంప్ ఇలా బంకర్లోకి వెళ్లిన విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. తాను బంకర్లోకి వెళ్లిన మాట వాస్తవమే అంటూనే.. అక్కడికి వెళ్లింది దాక్కోవడం కోసం మాత్రం కాదని చెప్పాడు. ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. నేను బంకర్లోకి వెళ్లడం గురించి ఏమేం రాశారో మీడియాలో చదివాను. బంకర్ను పరిశీలించడానికే వెళ్లాను. దాక్కోవడానికి కాదు. అక్కడికి వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అమెరికా అధ్యక్షుడినైన నా దగ్గరికి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ఓ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో శ్వేత సౌధంపై జరిగే దాడుల నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ రక్షించేందుకు ఈ బంకర్ను నిర్మించారు. ఇది శ్వేత సౌధంలో ఎక్కడ ఉందనే విషయం సీక్రెట్. వైట్హౌస్ మిలటరీ ఆఫీస్ సిబ్బంది దీని నిర్వహణ చూస్తుంటారు. 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్పై దాడులు జరిగిన సమయంలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ఇందులో తలదాచుకున్నారట. ఆ తర్వాత బంకర్ను ఉపయోగించింది ట్రంప్యే అంటున్నారు.
This post was last modified on June 5, 2020 2:16 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…