అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ఏ స్థితిలోనూ వెనక్కి తగ్గే రకం కాదు. కింద పడ్డా తనదే పైచేయి అంటాడు. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడతాడు. దూకుడుగానే వ్యవహరిస్తాడు. అలాంటి వ్యక్తి అమెరికాలో నల్ల జాతీయుల నిరసనలకు భయపడి వైట్ హౌస్ను ఖాళీ చేసి దానికి అనుబంధంగా ఉన్న బంకర్లో దాక్కున్నట్లుగా వార్తలు వచ్చాయి. అమెరికా అధికార వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వైట్ హౌస్కు అతి సమీపంలో ఆందోళనలు జరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా భద్రత అధికారులు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని బంకర్లోకి తీసుకెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇలా బంకర్లోకి వెళ్లడం మామూలే.
ఐతే ట్రంప్ ఇలా బంకర్లోకి వెళ్లిన విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. తాను బంకర్లోకి వెళ్లిన మాట వాస్తవమే అంటూనే.. అక్కడికి వెళ్లింది దాక్కోవడం కోసం మాత్రం కాదని చెప్పాడు. ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. నేను బంకర్లోకి వెళ్లడం గురించి ఏమేం రాశారో మీడియాలో చదివాను. బంకర్ను పరిశీలించడానికే వెళ్లాను. దాక్కోవడానికి కాదు. అక్కడికి వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అమెరికా అధ్యక్షుడినైన నా దగ్గరికి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ఓ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో శ్వేత సౌధంపై జరిగే దాడుల నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ రక్షించేందుకు ఈ బంకర్ను నిర్మించారు. ఇది శ్వేత సౌధంలో ఎక్కడ ఉందనే విషయం సీక్రెట్. వైట్హౌస్ మిలటరీ ఆఫీస్ సిబ్బంది దీని నిర్వహణ చూస్తుంటారు. 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్పై దాడులు జరిగిన సమయంలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ఇందులో తలదాచుకున్నారట. ఆ తర్వాత బంకర్ను ఉపయోగించింది ట్రంప్యే అంటున్నారు.
This post was last modified on June 5, 2020 2:16 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…