Political News

ఎగ్జిట్ పోల్ రిజ‌ల్ట్‌.. ఈట‌ల‌కే మొగ్గు.. వైసీపీ గెలుపు!!

తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బ త‌గులుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ప్ర‌క్రియ‌లో ఓట‌ర్లు పోటెత్తారు. ఏపీలోని బ‌ద్వేల్‌పై క‌న్నా.. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ మ‌రింత ఎక్కువ‌గా ఉంది. హుజూరాబాద్ఉప ఎన్నిక‌లో.. బీజేపీ అభ్య‌ర్తిగా పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌కు సానుభూతి ప‌వ‌నాలు జోరుగా వీచాయ‌ని చెబుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా మంచి ప‌ట్టున్న నాయ‌కుడు.. ఉప ఎన్నిక‌కు ముందు పాద‌యాత్ర కూడా చేసిన నాయ‌కుడుగా ఈట‌ల రాజేంద‌ర్ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు తేల్చ‌శారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎన్నిక ముగిసే స‌మ‌యానికి 79 శాతం ఓటింగ్ జ‌రిగింది. దీనిని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు గానే ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇది ఈట‌ల‌కు క‌లిసి వ‌చ్చిన ప‌రిణామంగా చెబుతున్నారు. ద‌ళిత బంధు స‌హా అనేక ప‌థ‌కాలు చేప‌ట్టినా.. అవి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు చేర‌క‌పోవ‌డం.. టీఆర్ ఎస్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను పెంచింద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో సానుబూతి ఈట‌ల‌కు అస్త్రంగా మారింద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఈట‌ల గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని.. చెబుతున్నారు. ఏపీలోని బ‌ద్వేల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇంటింటికీ తిరిగి.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు.. జ‌గ‌న్‌పై ఉన్న అభిమానం.. ఇక్క‌డ ఓట్ల రూపంలో ప‌డింద‌ని అంటున్నారు..

తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ రెండు నియోజ‌క‌వ వ‌ర్గాల్లోనూ.. ఆశించిన విధంగా పోలింగ్ సాగింది. బ‌ద్వేల్‌లో 60.5 శాతం.. హుజూరాబాద్‌లో 79 శాతం ఓట్లు పోల‌య్యాయి. ఓట‌ర్ల నాడి.. ఏంట‌నేది.. ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైంది. ఇక‌, ఇప్పుడు ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌నే విష‌యంపై స‌ర్వేలు త‌మ ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. తాజా ప‌రిణామాలను ప‌రిశీలించిన విశ్లేష‌కులు.. బ‌ద్వేల్‌లో దివంగ‌త వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌పై సానుభూతి ప‌వ‌నాలు జోరుగా వీచాయ‌ని అంటున్నారు.

పైగా ఇక్క‌డ పోలింగ్ శాతం త‌గ్గ‌డం.. వైసీపీకి క‌లిసి వ‌చ్చింద‌నే అంటున్నారు. అంతేకాదు.. ప్ర‌ధాన పార్టీలు.. పోటీలో లేక పోవ‌డం.. బీజేపీ ఇక్క‌డ పోటీ చేసినా.. ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి వైసీపీకి క‌లిసి వ‌చ్చింద‌ని.. చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తున్న ప‌రిశీల‌కులు.. బ‌ద్వేల్ లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని చెప్పేస్తున్నారు. అయితే.. మెజారిటీ 50 వేలలోపే ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని.. వైసీపీ అంచ‌నా వేసుకున్న‌ట్టు.. ల‌క్ష మెజారిటీ రాద‌ని.. పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన వారు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణ ప్ర‌భు్త్వానికి భారీ దెబ్బ త‌గులుతుంద‌ని.. అంటున్నారు. మ‌రి వాస్త‌వ ఫ‌లితాలు.. న‌వంబ‌రు 2న వ‌చ్చే వ‌ర‌కు అంద‌రూ వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on October 31, 2021 8:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

2 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

3 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

5 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

7 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

15 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

16 hours ago