తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎన్నో ఆశలతో ఉన్న అధికార పార్టీ టీఆర్ ఎస్కు ఎదురు దెబ్బ తగులుతుందని పరిశీలకులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పోటెత్తారు. ఏపీలోని బద్వేల్పై కన్నా.. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికపై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. హుజూరాబాద్ఉప ఎన్నికలో.. బీజేపీ అభ్యర్తిగా పోటీ చేసిన ఈటల రాజేందర్కు సానుభూతి పవనాలు జోరుగా వీచాయని చెబుతున్నారు. వ్యక్తిగతంగా మంచి పట్టున్న నాయకుడు.. ఉప ఎన్నికకు ముందు పాదయాత్ర కూడా చేసిన నాయకుడుగా ఈటల రాజేందర్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని పరిశీలకులు తేల్చశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్నిక ముగిసే సమయానికి 79 శాతం ఓటింగ్ జరిగింది. దీనిని ప్రభుత్వ వ్యతిరేక ఓటు గానే పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఈటలకు కలిసి వచ్చిన పరిణామంగా చెబుతున్నారు. దళిత బంధు సహా అనేక పథకాలు చేపట్టినా.. అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరకపోవడం.. టీఆర్ ఎస్కు గట్టి ఎదురు దెబ్బతగిలిందని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచిందని.. అంటున్నారు. అదేసమయంలో సానుబూతి ఈటలకు అస్త్రంగా మారిందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఈటల గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని.. చెబుతున్నారు. ఏపీలోని బద్వేల్లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని.. పరిశీలకులు చెబుతున్నారు. ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతోపాటు.. జగన్పై ఉన్న అభిమానం.. ఇక్కడ ఓట్ల రూపంలో పడిందని అంటున్నారు..
తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ రెండు నియోజకవ వర్గాల్లోనూ.. ఆశించిన విధంగా పోలింగ్ సాగింది. బద్వేల్లో 60.5 శాతం.. హుజూరాబాద్లో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్ల నాడి.. ఏంటనేది.. ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం దక్కించుకుంటుందనే విషయంపై సర్వేలు తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలించిన విశ్లేషకులు.. బద్వేల్లో దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి సుధపై సానుభూతి పవనాలు జోరుగా వీచాయని అంటున్నారు.
పైగా ఇక్కడ పోలింగ్ శాతం తగ్గడం.. వైసీపీకి కలిసి వచ్చిందనే అంటున్నారు. అంతేకాదు.. ప్రధాన పార్టీలు.. పోటీలో లేక పోవడం.. బీజేపీ ఇక్కడ పోటీ చేసినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం వంటివి వైసీపీకి కలిసి వచ్చిందని.. చెబుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేస్తున్న పరిశీలకులు.. బద్వేల్ లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని చెప్పేస్తున్నారు. అయితే.. మెజారిటీ 50 వేలలోపే ఉండే అవకాశం ఉంటుందని.. వైసీపీ అంచనా వేసుకున్నట్టు.. లక్ష మెజారిటీ రాదని.. పోలింగ్ సరళిని గమనించిన వారు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణ ప్రభు్త్వానికి భారీ దెబ్బ తగులుతుందని.. అంటున్నారు. మరి వాస్తవ ఫలితాలు.. నవంబరు 2న వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…