Political News

స్వపక్షంలో విపక్షంపై జగన్ ఫోకస్ చేయట్లేదా?

సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. వైసీపీ పాలనపై ఏపీ ప్రజల్లో చాలామంది సంతృప్తి వ్యక్తం చేశారని ఆ పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తమ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని…తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అంటున్నారు. కొన్ని విషయాలు మినహా జగన్ పాలన పట్ల ప్రజల్లోను పెద్దగా అసంతృప్తి లేదు. ఇదంతా నాణేనికి ఓ వైపు. నాణేనికి మరోవైపు….జగన్ పాలనపై విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా పెదవి విరుస్తున్నారు.

అంతేకాదు, సొంత పార్టీపైనే కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. సారా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇసుక విషయంలో పల్లం బ్రహ్మనాయుడు, నీళ్ల విషయంలో మహీధర్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా, ఆ జాబితాలోకి సీనియర్ పొలిటిషియన్ ఆనం రామ నారాయణ రెడ్డి చేరారు. ఈ ఏడాది పాలనలో తన సొంత నియోజకవర్గం వెంకటగిరికి ఏమీ చేయలేకపోయానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చెప్పిన మాటను సైతం అధికారులు వినడం లేదని, జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పిన ఆనం….ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని, జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని ఆనం అసహనం వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు మర్చిపోయారని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆనం అన్నారు.

తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప…మిగతా ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం తాను ఏమీ చేయలేకపోతున్నానని, ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడం తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు. జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు ఇచ్చిన డీపీఆర్ లు ఎక్కడున్నాయో కూడా తనకు తెలీదన్నారు.

స్వపక్షంలోనే విపక్షంపై జగన్ ఫోకస్ చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ్మినేని, పల్లం బ్రహ్మనాయుడు, మహీధర్ రెడ్డి, ఆనం..ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కొందరైతే….కక్కలేక మింగలేక మరి కొంతమంది నేతలున్నారని అంటున్నారు. విపక్షాల సంగతి పక్కనపెడితే…సొంత పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలపై జగన్ సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరముందని చెబుతున్నారు.

అధికారులకు జగన్ స్వేచ్ఛనిచ్చారని….దాని వల్ల కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వాదన ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇదే తరహా పొరపాటు చేశారన్న విమర్శలున్నాయి. మరి, జగన్ ఈ విషయంపై ఫోకస్ చేయకుంటే….నివురుగప్పిన నీరులా ఉన్న ఎమ్మెల్యేల అసహనం…భవిష్యత్తులో దావానలం అవుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 4, 2020 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago