Political News

బీజేపీకి ప‌వ‌న్ షాక్‌!

ఊహాగానాలు నిజ‌మ‌య్యాయి.. అనుకున్న‌ట్లు గానే పొత్తులో ఉన్న బీజేపీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ఆశ‌ల‌కు ప‌వ‌న్ తూట్లు పొడిచార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు భావించారు.

కానీ ప‌వ‌న్ మాత్రం అలాంటిదేమీ చేయ‌లేదు. ఆ ఉప ఎన్నిక‌తో నేటితో ప్ర‌చారం గ‌డువు ముగుస్తుంది. కానీ ఇప్ప‌టికీ ప‌వ‌న్ నేరుగా ప్ర‌చారంలో పాల్గొనే దిశ‌గా ఎలాంటి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేదు. బీజేపీ అభ్య‌ర్థిగా ఓట్లు వేయాల‌ని అడుగుతూ క‌నీసం త‌న పేరుతోనైనా ఒక్క ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌లేదు.

అధికార వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. వైసీపీ త‌మ అభ్య‌ర్థిగా దివంగ‌త వెంక‌ట సుబ్బ‌య్య భార్య సుధ‌ను బ‌రిలో దించింది. చ‌నిపోయిన నాయ‌కుడి కుటుంబ స‌భ్యుల‌కే టికెట్ కేటాయించ‌డంతో ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌ని కోరుతూ రాజ‌కీయ విలువ‌లు పాటించి జ‌న‌సేన పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. టీడీపీ కూడా సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తామ‌ని చెప్పి పోరుకు దూరంగా ఉంది. కానీ వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని చెప్పి బీజేపీ త‌మ అభ్యర్థిని ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ కూడా ఎన్నిక‌ల పోటీలో నిలిచింది.

త‌మ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో దించిన బీజేపీ.. ఈ ఎన్నిక‌లో త‌మ అభ్య‌ర్థి త‌ర‌పున ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌మ పార్టీనే పోటీ నుంచి త‌ప్పించిన ప‌వ‌న్‌.. ఇక బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌పున ఎందుకు ప్ర‌చారం చేస్తార‌నే అనుమానాలు క‌లిగాయి. కానీ ప‌వ‌న్ ప్ర‌చారానికి వ‌స్తార‌ని.. ఆ మేర‌కు ఆ పార్టీ కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ హామీ కూడా ఇచ్చార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. కానీ ప‌వ‌న్ ప్ర‌చారానికి రావ‌డం కాదు క‌దా.. క‌నీసం ఈ పార్టీ పేరుతో ఒక్క ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల కాక‌పోవ‌డం బీజేపీకి షాక్‌లా త‌గిలింది.

ఈ ఎన్నిక‌లో వైసీపీ గెలుపు లాంఛ‌న‌మే. కానీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట్లు తెచ్చుకునేందుకే బీజేపీ తాప‌త్రాయ‌ప‌డుతోంది. ఆ దిశ‌గా బాగానే ఖ‌ర్చు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌చారానికి వ‌స్తే ప్రయోజ‌నం ఉంటుంద‌ని భావించింది. కానీ ఇప్పుడు ప‌వ‌న్ షాక్ ఇవ్వ‌డంతో బీజేపీకి దెబ్బ ప‌డ‌డంతో పాటు ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేసిన‌ట్ల‌యింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి చూస్తుంటే బీజేపీతో బంధం తెంచుకునే దిశ‌గా సాగుతున్నార‌నే ఊహాగానాల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

This post was last modified on October 27, 2021 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

2 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

5 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

6 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

7 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

7 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

7 hours ago