అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేలో శశికళ అలియాస్ చిన్నమ్మ చిచ్చు పెట్టినట్లే ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్ శెల్వం మధ్య శశికళ విషయంలో తాజాగా విభేదాలు మొదలైనట్లుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీలోకి చేర్చుకునే విషయమై పార్టీ తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని పన్నీర్ చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.
అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదలైన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లక ముందు, విడుదలైన దగ్గర నుంచి పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని, పార్టీపై ఆధిపత్యం తనదే అని చిన్నమ్మ పదే పదే ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విషయం ఏమిటంటే శశికళను పార్టీ చాలా సంవత్సరాల క్రితమే బహిష్కరించింది. పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లోనే చిన్నమ్మను బహిష్కరిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది.
పార్టీ నుంచి తనను బహిష్కరించినా శశికళ మాత్రం పార్టీ తనదే అని, తానే ప్రధాన కార్యదర్శిని అంటు నానా గోల చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె పార్టీ గుర్తున్న జెండానే తన కారుపై పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం తయారైంది. దీంతో పార్టీ నేతలంతా ఐకమత్యంగా ఉండి చిన్నమ్మను ఎదుర్కోవాలని పార్టీలోని సీనియర్లంతా నిర్ణయించారు. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా పన్నీర్ చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు.
పన్నీర్-పళని మధ్య పెరుగుతున్న విభేదాలను శశికళ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళ విభేదాలను అడ్వాంటేజ్ తీసుకుని పన్నీర్ తో శశికళ చేతులు కలిపినట్లు పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ గురించి పన్నీర్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటంటు సీనియర్లు మండిపోతున్నారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంలో పన్నీర్ కూడా సంతకం చేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి పార్టీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న గ్యాప్ ను చిన్నమ్మ మెల్లిగా పెంచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకుని నేతలను తన ఆధీనంలోకి తీసుకునేందుకు శశికళ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు పన్నీర్ ను దగ్గరకు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. నిజంగానే పన్నీర్ గనుక శశికళకు మద్దతుగా నిలబడితే అన్నాడీఎంకే నిలువుగా చీలిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on October 27, 2021 11:51 am
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…