Political News

బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !

తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఇప్ప‌టికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పాన్ని ప‌ట్టించుకోని ఆయ‌న ఇప్పుడు దానిపై ప్ర‌త్యేక దృష్టి సారించారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫ‌లితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీకి దెబ్బ ప‌డింది. మ‌రోవైపు వైసీపీ కూడా అక్క‌డ ప‌ట్టు సాధించ‌డం కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది.

బాబులో కుప్పం క‌ల‌వ‌రం మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌రిగే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నేది ఆయ‌న ఉద్దేశ్యంగా క‌నిపిస్తోంది. త‌న‌కు కంచుకోట‌గా ఉన్న కుప్పం గురించి మూడు ద‌శాబ్దాలుగా బాబు అస‌లు ఆలోచించ‌లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న లేకున్నా.. కుప్పం ప్ర‌జ‌లు త‌న మాట వింటార‌ని బాబుకు న‌మ్మ‌కం ఉండేది. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుచేసి జ‌గ‌న్ తొలిసారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి కుప్పంలో ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చింది. కుప్పంలో వైసీపీ ఆధిప‌త్యం కోసం ప్రయ‌త్నించ‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌జ‌లు కూడా వైసీపీ వైపు మ‌ళ్లుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అక్క‌డి టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో కుప్పంపై బాబు ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఏకంగా నాలుగు రోజుల పాటు బాబు కుప్పం నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బాబు ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. ఈ మేర‌కు బాబు ముందుగానే స్థానిక నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు త‌న కుప్పం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌ని బాబు క‌రాఖండిగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా కుప్పాన్ని బాబుకు దూరం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్క‌డి మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డికి అప్ప‌గించారు. ప్ర‌స్తుతం బ‌ద్వేలు ఉప ఎన్నిక బాధ్య‌త‌ల్లో పెద్దిరెడ్డి బిజీగా ఉన్నారు. అందుకే ఆయ‌న కొడుక్కి జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. మిధున్ కూడా ఆ దిశ‌గా ఇప్పటికే రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on October 26, 2021 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

35 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago