Political News

బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !

తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఇప్ప‌టికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పాన్ని ప‌ట్టించుకోని ఆయ‌న ఇప్పుడు దానిపై ప్ర‌త్యేక దృష్టి సారించారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫ‌లితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీకి దెబ్బ ప‌డింది. మ‌రోవైపు వైసీపీ కూడా అక్క‌డ ప‌ట్టు సాధించ‌డం కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది.

బాబులో కుప్పం క‌ల‌వ‌రం మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌రిగే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నేది ఆయ‌న ఉద్దేశ్యంగా క‌నిపిస్తోంది. త‌న‌కు కంచుకోట‌గా ఉన్న కుప్పం గురించి మూడు ద‌శాబ్దాలుగా బాబు అస‌లు ఆలోచించ‌లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న లేకున్నా.. కుప్పం ప్ర‌జ‌లు త‌న మాట వింటార‌ని బాబుకు న‌మ్మ‌కం ఉండేది. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుచేసి జ‌గ‌న్ తొలిసారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి కుప్పంలో ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చింది. కుప్పంలో వైసీపీ ఆధిప‌త్యం కోసం ప్రయ‌త్నించ‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌జ‌లు కూడా వైసీపీ వైపు మ‌ళ్లుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అక్క‌డి టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో కుప్పంపై బాబు ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఏకంగా నాలుగు రోజుల పాటు బాబు కుప్పం నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బాబు ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. ఈ మేర‌కు బాబు ముందుగానే స్థానిక నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు త‌న కుప్పం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌ని బాబు క‌రాఖండిగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా కుప్పాన్ని బాబుకు దూరం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్క‌డి మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డికి అప్ప‌గించారు. ప్ర‌స్తుతం బ‌ద్వేలు ఉప ఎన్నిక బాధ్య‌త‌ల్లో పెద్దిరెడ్డి బిజీగా ఉన్నారు. అందుకే ఆయ‌న కొడుక్కి జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. మిధున్ కూడా ఆ దిశ‌గా ఇప్పటికే రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

33 minutes ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

4 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

6 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

8 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

8 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

10 hours ago