Political News

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. పార్టీకి చంద్ర‌బాబు ఇస్తున్న సందేశ‌మేంటి?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ను ఆయ‌న క‌లిశారు. ఏపీలో త‌మ పార్టీ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను.. అధికార పార్టీ దూకుడును కూడా ఆయ‌న వివ‌రించారు. మొత్తంగా రెండు రోజుల పాటు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను పెట్టుకున్న చంద్ర‌బాబు.. త‌న స‌హ‌జ ధోర‌ణిలో.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. స‌హ‌జంగా చంద్ర‌బాబు చేసే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌కు.. ఇప్పుడు చేసిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు మ‌ధ్య చాలా తేడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో చంద్ర‌బాబు.. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా.. అతి త‌క్కువ మందితోనే వ‌చ్చేవారు. అదే స‌మ‌యంలో కీలక‌మైన వారికే ప్రాధాన్యం ఇచ్చేవారు. త‌న వెంట ఉండ‌నిచ్చేవారు. వీరిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. స‌హా ఒకరిద్ద‌రికి మాత్ర‌మే ప్రాదాన్యం ఉండేది. అయితే.. ఈ ద‌ఫా అనూహ్యంగా.. ఒక పెద్ద బృందాన్నే చంద్ర‌బాబు త‌న‌వెంట తీసుకువెళ్లారు. వీరిలో నిజానికి ఢిల్లీలో అవ‌స‌రం లేన‌వారు కూడా ఉన్నారు. వాస్త‌వానికి డిల్లీ లో చ‌క్రం తిప్పుతున్న వారిలో రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్‌, ఎంపీ.. రామ్మోహ‌న్ నాయుడు.. ఇలా కొంద‌రు మాత్ర‌మే ఉన్నారు.

సో. వీరిని తీసుకువెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపితే స‌రిపోతుంది. కానీ, మాజీ మంత్రులు.. కాల్వ శ్రీనివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, అచ్చ‌న్నాయుడు, ఎమ్మెల్యేలు.. ప‌య్యావుల కేశ‌వ్‌, డోలా బాల వీరాంజ‌నేయ స్వామితోపాటు.. మ‌హిళా నేత‌లు.. వంగ‌ల పూడి అనిత‌, పంచుమ‌ర్తి అనురాధ‌, ఎంపీలు కేశినేని నాని, ఇంకా మ‌రింత మంది నాయ‌కుల‌ను చంద్ర‌బాబు త‌న బృందంలో తీసుకువెళ్లారు. స‌రే.. ఇంత మంది వెళ్తేనే త‌ప్ప‌.. రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌రా.? అంటే.. కేవ‌లం ఐదుగురిని మాత్ర‌మే లోప‌ల‌కు అలౌ చేస్తారు. సో.. ఇంత మంది వెళ్లినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

అయిన‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు వీరిని ఎందుకు తీసుకువెళ్లారు? అంటే.. పార్టీలో ఒక కీల‌క‌మైన సందేశాన్ని ఇవ్వ‌డానికే బాబు ఇలా వీరిని వెంటేసుకు వెళ్లార‌నే చ‌ర్చ సాగుతోంది. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఏం చేసినా.. కొంద‌రికి మాత్రమే చెప్పేవారు. దీంతో గోప్య‌త పాటిస్తున్నార‌నే వాద‌న‌.. త‌మ అధినేత త‌మ‌కే చెప్ప‌డం లేద‌నే ఆవేద‌న నేత‌ల్లో క‌నిపించేది. అయితే.. దీనిని పెద్ద సీరియ‌స్‌గా భావించ‌ని చంద్ర‌బాబు త‌న దారిలో తాను న‌డిచారు. అయితే.. ఇప్పుడు.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో నేత‌ల‌ను ఏకం చేసుకునేందుకు.. ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక‌పై అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. బాబు.. వెంట భారీ బృందం ఉండ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 26, 2021 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

2 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

8 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

10 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

10 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

11 hours ago