Political News

ఎమ్మెల్యేని గంటల తరబడి వెయిట్ చేయించిన క‌లెక్ట‌ర్

ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందాల‌న్నా.. సంక్షేమ ప‌థ‌కాలు చేరువ కావాల‌న్నా.. ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారులు క‌లిసి ప‌ని చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్య‌వ‌స్థ‌లు స‌క్ర‌మంగా త‌మ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తేనే ఏ కార్య‌క్ర‌మ‌మైన విజ‌య‌వంతం అవుతుంది. కానీ ఓ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ ఆల‌స్యంగా వ‌చ్చార‌ని చెప్పి ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోవ‌డం.. ఎమ్మెల్యే వెళ్లిపోయింద‌ని క‌లెక్ట‌ర్ కూడా ఆ కార్య‌క్ర‌మాన్ని ఆరంభించ‌కుండ‌నే వెనుదిరిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ తాజా సంఘ‌ట‌న చింతూరులో జ‌రిగింది.

రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే ధ‌న‌లక్ష్మీ అధికారుల‌పై అలిగారు. చింతూరులోని ఆదిమ గురుకుల కళాశాల ప్రాంగ‌ణంలో నిర్మించిన గ్రంథాల‌య భ‌వ‌న ప్రారంభోత్సవంతో పాటు వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఆమె వ‌చ్చారు. కానీ క‌లెక్టర్ ఆల‌స్యం చేయ‌డంతో మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. మ‌రోవైపు క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ కూడా చింతూరు వ‌చ్చారు. కానీ ఆయ‌న చింతూరు నుంచి నేరుగా భ‌ద్రాచ‌లం వెళ్లి సీతారాముల‌ను ద‌ర్శ‌న చేసుకున్నారు. అక్క‌డి నుంచి తిరిగి చింతూరు మండ‌లం చేరుకున్న క‌లెక్ట‌ర్ ఏడుగురాళ్ల‌ప‌ల్లిలో వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. దీంతో చింతూరులో గ్రంథాల‌య భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి ఆయ‌న రావ‌డం ఆల‌స్య‌మైంది.

ఎమ్మెల్యే ధ‌న‌ల‌క్ష్మీ క‌లెక్ట‌ర్ కోసం కొద్ది గంట‌ల పాటు వేచి చూశారు. కానీ ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం క‌లెక్ట‌ర్ స‌మ‌యానికి రాలేదంటూ గంటల త‌ర‌బ‌డి వేచి చూసిన ఆమె అలిగారు. దీంతో గ్రంథాల‌య భ‌వ‌నం ఆరంభించ‌కుండానే తిరిగి రంప‌చోడ‌వరం వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే వెళ్లిన త‌ర్వాత గ్రంథాల‌య భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ద‌గ్గ‌ర‌కు క‌లెక్ట‌ర్ వ‌చ్చారు. కానీ ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయిన విష‌యాన్ని తెలుసుకున్న ఆయ‌న కూడా గ్రంథాల‌య భ‌వనాన్ని ప్రారంభించ‌కుండానే తిరిగి కాకినాడ వెళ్లారు. దీంతో అనుకున్న ప్ర‌కారం గ్రంథాల‌య భ‌వ‌నం ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌లేదు. అయితే ఎమ్మెల్యే గంట‌ల త‌ర‌బ‌డి ఎదురు చూసిన‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్ రాక‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ వైసీపీ నాయ‌కులు అధికారుల తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ధ‌ర్నాకు దిగారు. చివ‌ర‌కు ఐటీడీఏ పీవో వెంట‌క ర‌మ‌ణ వాళ్ల‌కు న‌చ్చ‌జెప్ప‌డంతో ధ‌ర్నా విర‌మించారు. ఎమ్మెల్యేతో పాటు క‌లెక్ట‌ర్ కూడా గ్రంథాల‌య ప్రారంభోత్స‌వానికి స‌కాలంలో వ‌చ్చి ఉంటే ఇదంత జ‌రిగేదే కాద‌ని అక్క‌డి జ‌నాలు అనుకుంటున్నారు.

This post was last modified on October 25, 2021 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago