ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా.. సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది. కానీ ఓ కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా వచ్చారని చెప్పి ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోవడం.. ఎమ్మెల్యే వెళ్లిపోయిందని కలెక్టర్ కూడా ఆ కార్యక్రమాన్ని ఆరంభించకుండనే వెనుదిరిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ తాజా సంఘటన చింతూరులో జరిగింది.
రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ అధికారులపై అలిగారు. చింతూరులోని ఆదిమ గురుకుల కళాశాల ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. కానీ కలెక్టర్ ఆలస్యం చేయడంతో మనస్థాపానికి గురయ్యారు. మరోవైపు కలెక్టర్ హరికిరణ్ కూడా చింతూరు వచ్చారు. కానీ ఆయన చింతూరు నుంచి నేరుగా భద్రాచలం వెళ్లి సీతారాములను దర్శన చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి చింతూరు మండలం చేరుకున్న కలెక్టర్ ఏడుగురాళ్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో చింతూరులో గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి ఆయన రావడం ఆలస్యమైంది.
ఎమ్మెల్యే ధనలక్ష్మీ కలెక్టర్ కోసం కొద్ది గంటల పాటు వేచి చూశారు. కానీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కలెక్టర్ సమయానికి రాలేదంటూ గంటల తరబడి వేచి చూసిన ఆమె అలిగారు. దీంతో గ్రంథాలయ భవనం ఆరంభించకుండానే తిరిగి రంపచోడవరం వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గరకు కలెక్టర్ వచ్చారు. కానీ ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన కూడా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించకుండానే తిరిగి కాకినాడ వెళ్లారు. దీంతో అనుకున్న ప్రకారం గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం జరగలేదు. అయితే ఎమ్మెల్యే గంటల తరబడి ఎదురు చూసినప్పటికీ కలెక్టర్ రాకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. చివరకు ఐటీడీఏ పీవో వెంటక రమణ వాళ్లకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా గ్రంథాలయ ప్రారంభోత్సవానికి సకాలంలో వచ్చి ఉంటే ఇదంత జరిగేదే కాదని అక్కడి జనాలు అనుకుంటున్నారు.
This post was last modified on October 25, 2021 7:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…