చంద్రబాబు ఢిల్లీ టూర్పై వైసీపీ నాయకులు బెంగి పెట్టకున్నారా? సుదీర్ఘ కాలం విరామం తర్వాత.. ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ఏం చెబుతారో.. ఏం జరుగుతుందో.. అని తల్లడిల్లుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న విషయం తెలిసిందే. ముందుగానే ఆయన 36 పేజీలతో కూడిన లేఖలను.. ఆయన సంధించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సహా రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందద్కు కూడా చంద్రబాబు లేఖలు రాశారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన వివరించారు.
అదేసమయంలో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పాలన.. పోలీసుల తీరు.. సహా.. తాజాగా జరిగిన ఘటనకు డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. పోలీసులు ఎప్పుడు వచ్చారు.. ఇలా అనే విషయాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. మోడీ అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా .. ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఆయన మంగళవారం వరకు అక్కడే ఉండనున్నారు. ఈలోగా.. ఆయన ఢిల్లీకి వచ్చి.. చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి. ఇక, ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. అప్పాయింట్మెంట్ ఖరారైంది.
రాజ్యాంగ అధినేత అయిన.. కోవింద్ను కలిసి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు వివరించే ప్రయత్నం చేయనున్నారు. అంతేకాదు.. దాదాపు ఐదు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ.. వైసీపిని విమర్శించిన ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ అప్పాయింట్మెంట్ కూడా చంద్రబాబు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో మరికొందరు సీనియర్లను కూడా ఆయన కలుస్తారని.. అంటున్నారు. మొత్తంగా చూస్తే.. డిల్లీ లో చంద్రబాబు తనకు పాజిటివ్గా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే ఇప్పుడు వైసీపీలో కలకలానికి దారితీస్తోంది. తమపై ఏం చెబుతారో.. తమ పాలనపై ఏం చేస్తారో.. అనే గుబులు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. జగన్పై బురద జల్లేందుకే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని విమర్శించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ఉగ్రవాదం టీడీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు.
మొత్తంగా చూస్తే.. బాబు పర్యటన.. వైసీపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడం గమనార్హం. రాష్ట్ంలో అవినీతి జరుగుతోందని.. కొన్నాళ్లుగా బాబు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపైనా.. ఆయనకేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కౌంటర్గా జగన్ కూడా ఢిల్లీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 24, 2021 12:58 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…