Political News

వైసీపీలో ముస‌లం.. ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య విబేధాలు..?

చిత్తూరు వైసీపీలో ముస‌లం వ‌చ్చిందా? కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా ? దీంతో పార్టీలో కీల‌క మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. పుంగ‌నూరు ఎమ్మెల్యే క‌మ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు ఓ ర‌కంగా స్నేహితులు.. రాజకీయంగా చూస్తే.. అంత‌కుమించి.. అన్న రేంజ్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చేశారు. ముఖ్యంగా టీడీపీని సాధ్య‌మైనంత వ‌ర‌కు జిల్లాలో డైల్యూట్ చేసేందుకు ఇద్ద‌రూ క‌లిసే ముందుకు సాగారు.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పంలో వైసీపీ జెండాను ఎగ‌రేసేందుకు ఇద్దరు నేత‌లూ.. క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగారు. ఈ క్ర‌మంలోనే కుప్పం మునిసిపాలిటీని.. ఏర్పాటు చేయ‌డంలో అటు ఎంపీ.. రెడ్డ‌ప్ప‌, ఇటు మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఇటీవ‌ల ముగిసిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయ‌ని జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా కుప్పంలో ఎంపీ రెడ్డ‌ప్ప దూకుడు ఎక్కువ‌గా ఉంది. నియోజ‌క‌వర్గంలో ఎక్క‌డ చూసినా.. త‌న పేరుతో ఉన్న ఫ్లెక్సీల‌నే ఆయ‌న ఏర్పాటు చేయించారు.

అదే స‌మ‌యంలో పెద్దిరెడ్డి వ‌ర్గం కూడా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌గా.. స్థానిక అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి ఎంపీనే వాటిని తొల‌గించార‌ని.. పెద్దిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య కూడా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌గా మారాయి. ఒక్క కుప్పంలోనే కాకుండా.. చిత్తూరు పార్ల‌మెంటు ప‌రిధిలో ఇరువురు నేత‌ల రాజ‌కీయం ఇటీవ‌ల కాలంలో మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఒక‌ప్పుడు క‌లిసి రాజ‌కీయాలు చేసిన పెద్దిరెడ్డి, రెడ్డ‌ప్ప‌లు.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని.. జోరుగా గుస‌గుస వినిపిస్తోంది. రెడ్డి వ‌ర్గాన్ని ప్రోత్స‌హించ‌డం.. ఇష్టంలేకే.. రెడ్డ‌ప్ప దూరంగా ఉంటున్నార‌ని .. ఓ వ‌ర్గం చెబుతోంది.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జరిగినా..రెడ్డ‌ప్ప దూకుడు ఎక్కువ‌గా ఉంద‌ని.. మంత్రిగా పెద్దిరెడ్డికి ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. అధిష్టానం వ‌ద్ద త‌న‌కు రెడ్ కార్పెట్ ఉంద‌ని.. చెబుతున్నార‌ని.. అందుకే.. ఈ నేతల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తోంద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఈ దుమారం ఎటు దారితీస్తుందోన‌ని పార్టీనేత‌లు క‌ల‌వ‌రం చెందుతున్నారు. ఇక‌, టీడీపీ ఈ త‌ర‌హా ప‌రిణామాలనే ఆశించిన నేప‌థ్యంలో వైసీపీలో మ‌రింత విభేదాలు వ‌స్తే బాగుంటుంద‌ని.. కోరుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడిప్పుడే.. కుప్పంపై ప‌ట్టు సాధిస్తున్న స‌మ‌యంలో వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు.. ప‌ట్టుజార్చేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 24, 2021 9:43 pm

Share

Recent Posts

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…

1 hour ago

ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…

1 hour ago

ఫౌజీ తప్పుకుంటే… స్పిరిట్ ఏం చేస్తుంది

భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…

2 hours ago

AIతో ఈ దశాబ్దంలోనే మానవాళికి ముప్పు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…

2 hours ago

‘ఎన్నికల్లో చంపడానికైనా… చావడానికైనా సిద్ధం!’

ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…

2 hours ago

రావణుడితో కాదు గాడ్జిల్లాతో యుద్ధం చేయాలి

అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…

3 hours ago