మన మీద వ్యాపారం చేసి మన దేశానికి వ్యతిరేకంగా పని చేసే శక్తులు సాయం చేసే దేశం చైనా. మన దేశంలో ఏటా ఆ దేశం లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. మనం వాడే ఫోన్ వాళ్లదే. చూసే టీవీ వాళ్లదే. తొడిగే బట్ట వాళ్లదే. ఇంకా ఎన్నో వస్తువులు చైనా నుంచే తయారై వస్తాయి. విదేశీ వస్తువుల వినియోగం ఆపి.. దేశీయ ఉత్పత్తుల్నే కొంటే మన జీడీపీ ఎంతో మెరుగవుతుందని తెలిసినా వాటిని వీడలేని బలహీనత. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఐతే నిపుణులు మాత్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇండియా నుంచి ఆదాయం పొందినా పర్వాలేదు కానీ.. మనం వాడే యాప్స్ ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇండియాను చైనా ప్రమాదంలో పడేస్తుందేమో అన్న ఆందోళన ఈ మధ్య పెరుగుతోంది. అందుకే చైనా యాప్స్ అన్నింటినీ అన్ ఇన్స్టాల్ చేసేయాలన్న పిలుపు వినిపిస్తోంది.
ఇందుకోసం జైపూర్కు చెందిన ఓ సంస్థ.. రిమూవ్ చైనా యాప్స్ పేరుతో ఒక కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ వేసుకుంటే ఫోన్లో ఉన్న చైనా యాప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో అవసరం లేనివి అన్నీ తీసేయొచ్చు. టిక్ టాక్, షేర్ ఇట్.. ఇలా మన ఫోన్లో ఎన్నో చైనా యాప్స్ ఉంటాయి. ఐతే వాటికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ యాప్స్ కూడా వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. జనాల్లో చైతన్యం వచ్చి వరుసగా చైనా యాప్స్ను డెలీట్ చేసి పడేస్తున్నారు. ఐతే ఈ విషయం తెలిసి చైనా కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. గూగుల్ మీద ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఆ సంస్థ తమ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చైనా యాప్స్ యాప్ను తొలగించింది. దీంతో చైనా యాప్ల తొలగింపు ఆగిపోయింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఈ యాప్ ఉందంటూ గూగుల్ కుంటి సాకు చెప్పింది కానీ.. చైనా కంపెనీల ఒత్తిడికి తలొగ్గే ఆ యాప్ను తీసేశారన్నది స్పష్టం.
This post was last modified on June 3, 2020 10:33 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…