మన మీద వ్యాపారం చేసి మన దేశానికి వ్యతిరేకంగా పని చేసే శక్తులు సాయం చేసే దేశం చైనా. మన దేశంలో ఏటా ఆ దేశం లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. మనం వాడే ఫోన్ వాళ్లదే. చూసే టీవీ వాళ్లదే. తొడిగే బట్ట వాళ్లదే. ఇంకా ఎన్నో వస్తువులు చైనా నుంచే తయారై వస్తాయి. విదేశీ వస్తువుల వినియోగం ఆపి.. దేశీయ ఉత్పత్తుల్నే కొంటే మన జీడీపీ ఎంతో మెరుగవుతుందని తెలిసినా వాటిని వీడలేని బలహీనత. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఐతే నిపుణులు మాత్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇండియా నుంచి ఆదాయం పొందినా పర్వాలేదు కానీ.. మనం వాడే యాప్స్ ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇండియాను చైనా ప్రమాదంలో పడేస్తుందేమో అన్న ఆందోళన ఈ మధ్య పెరుగుతోంది. అందుకే చైనా యాప్స్ అన్నింటినీ అన్ ఇన్స్టాల్ చేసేయాలన్న పిలుపు వినిపిస్తోంది.
ఇందుకోసం జైపూర్కు చెందిన ఓ సంస్థ.. రిమూవ్ చైనా యాప్స్ పేరుతో ఒక కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ వేసుకుంటే ఫోన్లో ఉన్న చైనా యాప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో అవసరం లేనివి అన్నీ తీసేయొచ్చు. టిక్ టాక్, షేర్ ఇట్.. ఇలా మన ఫోన్లో ఎన్నో చైనా యాప్స్ ఉంటాయి. ఐతే వాటికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ యాప్స్ కూడా వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. జనాల్లో చైతన్యం వచ్చి వరుసగా చైనా యాప్స్ను డెలీట్ చేసి పడేస్తున్నారు. ఐతే ఈ విషయం తెలిసి చైనా కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. గూగుల్ మీద ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఆ సంస్థ తమ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చైనా యాప్స్ యాప్ను తొలగించింది. దీంతో చైనా యాప్ల తొలగింపు ఆగిపోయింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఈ యాప్ ఉందంటూ గూగుల్ కుంటి సాకు చెప్పింది కానీ.. చైనా కంపెనీల ఒత్తిడికి తలొగ్గే ఆ యాప్ను తీసేశారన్నది స్పష్టం.
This post was last modified on June 3, 2020 10:33 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…