ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మాజీ మంత్రి నారా లోకేశ్ లోపంగా భావిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. కొత్త తరహా ఇమేజ్ కోసం లోకేశ్ తహతహలాడుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
తనను ‘పప్పు’ పేరుతో డ్యామేజ్ చేసిన వేళ.. తనలోని ఫైర్ బ్రాండ్ ను ప్రదర్శించుకోవాలన్నట్లుగా లోకేశ్ ప్రెస్ మీట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కొత్త తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. తనను తాను సరికొత్తగా ప్రజంట్ చేసుకోవటంతో పాటు.. తన తండ్రి మాదిరి తాను సాఫ్ట్ గా ఉండనన్న సందేశాన్నిపార్టీ క్యాడర్ కు ఇవ్వటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ను చూసినప్పుడు లోకేశ్ కొన్ని సందర్భాల్లో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. తాను మారుతున్నానని.. ఇప్పటికే మారినట్లుగా స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ప్రెస్ మీట్ లో లోకేశ్ నోటి నుంచి ఈ తరహాలో వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on October 21, 2021 10:15 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…