ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మాజీ మంత్రి నారా లోకేశ్ లోపంగా భావిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. కొత్త తరహా ఇమేజ్ కోసం లోకేశ్ తహతహలాడుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
తనను ‘పప్పు’ పేరుతో డ్యామేజ్ చేసిన వేళ.. తనలోని ఫైర్ బ్రాండ్ ను ప్రదర్శించుకోవాలన్నట్లుగా లోకేశ్ ప్రెస్ మీట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కొత్త తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. తనను తాను సరికొత్తగా ప్రజంట్ చేసుకోవటంతో పాటు.. తన తండ్రి మాదిరి తాను సాఫ్ట్ గా ఉండనన్న సందేశాన్నిపార్టీ క్యాడర్ కు ఇవ్వటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ను చూసినప్పుడు లోకేశ్ కొన్ని సందర్భాల్లో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. తాను మారుతున్నానని.. ఇప్పటికే మారినట్లుగా స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ప్రెస్ మీట్ లో లోకేశ్ నోటి నుంచి ఈ తరహాలో వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on October 21, 2021 10:15 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…