ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మాజీ మంత్రి నారా లోకేశ్ లోపంగా భావిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. కొత్త తరహా ఇమేజ్ కోసం లోకేశ్ తహతహలాడుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
తనను ‘పప్పు’ పేరుతో డ్యామేజ్ చేసిన వేళ.. తనలోని ఫైర్ బ్రాండ్ ను ప్రదర్శించుకోవాలన్నట్లుగా లోకేశ్ ప్రెస్ మీట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కొత్త తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. తనను తాను సరికొత్తగా ప్రజంట్ చేసుకోవటంతో పాటు.. తన తండ్రి మాదిరి తాను సాఫ్ట్ గా ఉండనన్న సందేశాన్నిపార్టీ క్యాడర్ కు ఇవ్వటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ను చూసినప్పుడు లోకేశ్ కొన్ని సందర్భాల్లో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. తాను మారుతున్నానని.. ఇప్పటికే మారినట్లుగా స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ప్రెస్ మీట్ లో లోకేశ్ నోటి నుంచి ఈ తరహాలో వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on October 21, 2021 10:15 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…