Political News

ఈటల లెక్క కరెక్టేనా ?

ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ఎస్ సీటు టీఆర్ఎస్ గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల గెలిస్తే ఈసీటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఈటల రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తన ఎంఎల్ఏ సీటును తిరిగి తానే గెలుచుకున్నట్లవుతుంది. కాకపోతే బీజేపీ తరపున పోటీచేస్తున్నారు కాబట్టి కమలంపార్టీ బలం రెండునుండి మూడుకు పెరుగుతుంది.

‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు పెట్టారు’..ఇవి తాజాగా మాజీమంత్రి, హుజూరాబాద్ లో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. రు. 300 కోట్లు ఖర్చుచేసిన అధికార టీఆర్ఎస్ మరో వెయ్యి కోట్లు రూపాయలు ఖర్చులు చేయటానికి రెడీగా ఉందుంటు ఈటల చేసిన ఆరోపణలు బాగా చర్చనీయాంశమైంది. నిజంగానే ఈటల చెప్పినట్లుగా అంత భారీ ఎత్తున ఖర్చు చేయటానికి ఏముంది ? ఉపఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్ గెలిచినా అటు బీజేపీ గెలిచినా జరిగేదేమీ లేదు.

అయితే గెలుపోటములు పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఉండదు లోతుల్లోకి వెళితే. ఈటల ఓటమి కేసీయార్ కు ఇజ్జత్ కు సవాలైపోయింది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉండికూడా ఓ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయిందంటే అది కేసీయార్ కు ఎంత అవమానమో అందరికీ తెలిసందే. అందుకనే ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం కేసీయార్ కు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయింది.

అందుకనే ఈటల చాలా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టే ఇప్పటికే టీఆర్ఎస్ రు. 300 కోట్లు ఖర్చుపెట్టిందని, మరో వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీగా ఉందంటు ఒకటే గోల చేస్తున్నారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో ఖర్చు చేసిన 300 కోట్ల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు చేసిన ఖర్చేమో. ఈటలను ఎలాగైనా ఓడించటమే టార్గెట్ గా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజరుచేశారు. రోడ్లు వేయించటం, సామాజికవర్గాల వారీగా భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశారు.

నోటిఫికేషన్ విడుదలకు ముందు మంజూరు చేసిన నిధులు రు. 300 కోట్లంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక వెయ్యి కోట్ల రూపాయలంటేనే మరీ నమ్మబుద్ది కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖర్చులు చేయటంలో ఈటల కూడా తక్కువేమీకాదు. బీసీ సామాజికవర్గం నేత అయినంత మాత్రాన ఈటలను తక్కువగా అంచనా వేసేందుకు లేదు. ఆర్దికంగా ఈటల కూడా బాగా సౌండ్ పార్టీయేనట. మొత్తానికి ఈటల చెప్పిన లెక్కలు కరెక్టేనా అనే చర్చయితే జరుగుతోంది.

This post was last modified on October 15, 2021 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊరించి ముంచేసిన బంగ్లాదేశ్ : పాక్ ఇక ఇంటికే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం…

5 minutes ago

బ్రహ్మాజీ కష్టానికి దక్కని ఫలితం

బ్రహ్మాజీ అంతా తానై ప్రమోషన్లు చేసుకున్న బాపూ మొన్న శుక్రవారం విడుదలై కనీస స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక ఎదురీదుతోంది. బలగం…

35 minutes ago

ఫ్లాప్ హీరోయిన్ ఫేవరెట్ అయిపోయింది

దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి. అది ఉండబట్టే…

1 hour ago

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన…

2 hours ago

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు…

2 hours ago

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే…

3 hours ago