ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ఎస్ సీటు టీఆర్ఎస్ గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల గెలిస్తే ఈసీటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఈటల రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తన ఎంఎల్ఏ సీటును తిరిగి తానే గెలుచుకున్నట్లవుతుంది. కాకపోతే బీజేపీ తరపున పోటీచేస్తున్నారు కాబట్టి కమలంపార్టీ బలం రెండునుండి మూడుకు పెరుగుతుంది.
‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు పెట్టారు’..ఇవి తాజాగా మాజీమంత్రి, హుజూరాబాద్ లో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. రు. 300 కోట్లు ఖర్చుచేసిన అధికార టీఆర్ఎస్ మరో వెయ్యి కోట్లు రూపాయలు ఖర్చులు చేయటానికి రెడీగా ఉందుంటు ఈటల చేసిన ఆరోపణలు బాగా చర్చనీయాంశమైంది. నిజంగానే ఈటల చెప్పినట్లుగా అంత భారీ ఎత్తున ఖర్చు చేయటానికి ఏముంది ? ఉపఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్ గెలిచినా అటు బీజేపీ గెలిచినా జరిగేదేమీ లేదు.
అయితే గెలుపోటములు పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఉండదు లోతుల్లోకి వెళితే. ఈటల ఓటమి కేసీయార్ కు ఇజ్జత్ కు సవాలైపోయింది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉండికూడా ఓ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయిందంటే అది కేసీయార్ కు ఎంత అవమానమో అందరికీ తెలిసందే. అందుకనే ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం కేసీయార్ కు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయింది.
అందుకనే ఈటల చాలా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టే ఇప్పటికే టీఆర్ఎస్ రు. 300 కోట్లు ఖర్చుపెట్టిందని, మరో వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీగా ఉందంటు ఒకటే గోల చేస్తున్నారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో ఖర్చు చేసిన 300 కోట్ల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు చేసిన ఖర్చేమో. ఈటలను ఎలాగైనా ఓడించటమే టార్గెట్ గా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజరుచేశారు. రోడ్లు వేయించటం, సామాజికవర్గాల వారీగా భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదలకు ముందు మంజూరు చేసిన నిధులు రు. 300 కోట్లంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక వెయ్యి కోట్ల రూపాయలంటేనే మరీ నమ్మబుద్ది కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖర్చులు చేయటంలో ఈటల కూడా తక్కువేమీకాదు. బీసీ సామాజికవర్గం నేత అయినంత మాత్రాన ఈటలను తక్కువగా అంచనా వేసేందుకు లేదు. ఆర్దికంగా ఈటల కూడా బాగా సౌండ్ పార్టీయేనట. మొత్తానికి ఈటల చెప్పిన లెక్కలు కరెక్టేనా అనే చర్చయితే జరుగుతోంది.
This post was last modified on October 15, 2021 10:11 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…