Political News

లోకేష్‌కు డ్రగ్స్ దొరక్క ఎండిపోయాడు-కొడాలి నాని

మంత్రి కొడాలి నాని చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మీద తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు నాని. ఉత్తరాదిన వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడటం, అందులో ఏపీ అధికార పార్టీ వైకాపాకు చెందిన వ్యక్తులున్నట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొడాలి నాని స్పందించారు. నారా లోకేష్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటుందంటూ ఆయన ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

“డ్రగ్స్ అందకపోయినా, లేదంటే ఎక్కువ తీసుకున్నా మనుషుల్లో అనేక రకమైన మార్పులుంటాయి. ఆ మార్పులు గనుక గమనిస్తే అలాంటి మనుషులకు ఉదాహరణ నారా లోకేష్. మూడు నెలలుగా నారా లోకేష్ అడ్రస్ లేడు. ఎక్కడో పడి ఉంటున్నాడు. దేశంలో డ్రగ్స్ దొరక్కుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిగారు, అక్కడ కేసీఆర్ గారు.. ఢిల్లీ మోడీ గారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఎంతటివారైనా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. లోకేష్‌కు డ్రగ్స్ దొరక్క నక్క లాగా ఎండిపోయాడు. ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేది నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. డ్రగ్స్ తీసుకునేది ఆయన కుటుంబ సభ్యులు. డ్రగ్స్ కావచ్చు. వెన్ను పోటు కావచ్చు. అవినీతి కావచ్చు. ఈ దేశంలో చేసే పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉంది. ఔరంగజేబు లాంటి వెధవ్వి నువ్వు అని ఎన్టీఆర్ చెప్పిన మాటల్ని అందరూ నమ్ముతున్నారు” అని కొడాలి నాని విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కమ్మరాజ్యం స్థాపించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కుట్ర పన్నుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించడం గమనార్హం. తానూ కమ్మవాడినే అని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కమ్మవాళ్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయనన్నారు. లోకేష్ మీద నమ్మకం లేక, అతణ్ని నమ్ముకుంటే పార్టీ పనికి రాకుండా పోతుందని.. తన దత్తపుత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. మళ్లీ అతడితో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని.. ఆయన జనసేనను టీడీపీలో విలీనం చేసేస్తే మంచిదని నాని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 10, 2021 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

21 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

44 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

53 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago