దేశ కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచుకునే అవకాశం లేకపోవడంతో వినియోగాన్ని తగ్గిచుకోవాలంటు ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లో కోతలు కూడా మొదలైపోయాయి. ఈ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఒడిస్సాలో ప్రభావం మొదలైపోయింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 175 ఉన్నాయి. వీటన్నింటికీ ప్రధానంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. కరోనా వైరస్ లాంటి అనేక కారణాలతో పై దేశాల్లో బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీని కారణంగా పై దేశాల నుండి మనకు అందాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోయింది. ఇదే కాకుండా దేశీయంగా జరిగే బొగ్గు ఉత్పత్తి కూడా మందగించింది.
ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, మరోవైపు వినియోగం పెరిగిపోవడంతో డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరిగిపోయింది. 2019లో 106.6 బిలియన్ యూనిట్లున్న విద్యుత్ వినియోగం 2021లో 125 బిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా బొగ్గు దిగుమతులు తగ్గిపోవటంతో సమస్యలు మొదలైపోయాయి. వెంటనే కేంద్రం సంక్షోభ నివారణ చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు.
అందుకనే ముందు జాగ్రత్తగా విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు మొదలుపెట్టాయి. ఇళ్ళల్లో అయితే సాయంత్రాలు స్వచ్చంధంగా ఎయిర్ కండీషన్ వాడకాన్ని నిలిపేయాలని చెబుతున్నాయి. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో విద్యుత్ వృధాను కంట్రోల్ చేయాలంటున్నాయి. వ్యవసాయ విద్యుత్ ఎంత అవసరమో అంతే వినియోగించమంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏదోరూపంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుత్ వినియోగం తగ్గుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఏదేమైనా తొందరలోనే విద్యుత్ సంక్షోభం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంక్షోభాన్ని తప్పించుకునేందుకే బొగ్గు స్ధానంలో గ్యాస్ సరఫరా చేయాలంటు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. అయితే ఇది కూడా లేఖ రాసినంత తేలికకాదు. దీనికి మన వంతుగా చేయాల్సిందేమంటే అనవసరమైన విద్యుత్ వృధాను తగ్గించటమే. ఎందుకంటే విద్యుత్ వృధాను అరికట్టడం అంటే విద్యుత్ ఉత్పత్తి చేయటం లాంటిదే అన్న విషయాన్ని మరచిపోకూడదు. లేకపోతే సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం.
This post was last modified on October 10, 2021 10:27 am
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ…
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…