దేశ కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచుకునే అవకాశం లేకపోవడంతో వినియోగాన్ని తగ్గిచుకోవాలంటు ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లో కోతలు కూడా మొదలైపోయాయి. ఈ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఒడిస్సాలో ప్రభావం మొదలైపోయింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 175 ఉన్నాయి. వీటన్నింటికీ ప్రధానంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. కరోనా వైరస్ లాంటి అనేక కారణాలతో పై దేశాల్లో బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీని కారణంగా పై దేశాల నుండి మనకు అందాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోయింది. ఇదే కాకుండా దేశీయంగా జరిగే బొగ్గు ఉత్పత్తి కూడా మందగించింది.
ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, మరోవైపు వినియోగం పెరిగిపోవడంతో డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరిగిపోయింది. 2019లో 106.6 బిలియన్ యూనిట్లున్న విద్యుత్ వినియోగం 2021లో 125 బిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా బొగ్గు దిగుమతులు తగ్గిపోవటంతో సమస్యలు మొదలైపోయాయి. వెంటనే కేంద్రం సంక్షోభ నివారణ చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు.
అందుకనే ముందు జాగ్రత్తగా విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు మొదలుపెట్టాయి. ఇళ్ళల్లో అయితే సాయంత్రాలు స్వచ్చంధంగా ఎయిర్ కండీషన్ వాడకాన్ని నిలిపేయాలని చెబుతున్నాయి. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో విద్యుత్ వృధాను కంట్రోల్ చేయాలంటున్నాయి. వ్యవసాయ విద్యుత్ ఎంత అవసరమో అంతే వినియోగించమంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏదోరూపంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుత్ వినియోగం తగ్గుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఏదేమైనా తొందరలోనే విద్యుత్ సంక్షోభం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంక్షోభాన్ని తప్పించుకునేందుకే బొగ్గు స్ధానంలో గ్యాస్ సరఫరా చేయాలంటు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. అయితే ఇది కూడా లేఖ రాసినంత తేలికకాదు. దీనికి మన వంతుగా చేయాల్సిందేమంటే అనవసరమైన విద్యుత్ వృధాను తగ్గించటమే. ఎందుకంటే విద్యుత్ వృధాను అరికట్టడం అంటే విద్యుత్ ఉత్పత్తి చేయటం లాంటిదే అన్న విషయాన్ని మరచిపోకూడదు. లేకపోతే సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం.
This post was last modified on October 10, 2021 10:27 am
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…