Political News

సొంతింటికే నిప్పంటించుకుంటున్నారా ?

ఆప్ఘనిస్థాన్ లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు వ్యవహారం చూసిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న దేశం ఆఫ్ఘన్ మాత్రమే. ఇలాంటి దేశంలోనే బాంబులు పేలడమంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేలుస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ ఇపుడు మాత్రం తమ దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలే టార్గెట్ గా బాంబులు పేల్చడం గమనార్హం.

ముస్లింల్లో సున్నీలు, షియాలు బలమైన ప్రత్యర్థి వర్గాలు. ప్రస్తుతం దేశంలో సున్ని వర్గానికి చెందిన వారిదే ఆధిపత్యం. తాలిబన్లు, హక్కాని నెట్ వర్క్ లో కూడా సున్నీలదే ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది. అంటే ఒకరకంగా తాలిబన్లు, హక్కానీ నెట్ వర్కనే కాదు మామూలు జనాల్లో కూడా సున్నీ-షియా వర్గాల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉంటాయి. ఇప్పుడు దేశంలో జరిగిందిదే. కుందుజ్ లోని గొజరే సయ్యద్ అబద్ మసీదులో శుక్రవారం ప్రార్ధనలు చేసుకుంటున్న షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొందరు బాంబు పేల్చారు. ఈ దాడిలో కనీసం 100 మంది చనిపోతే మరో 150 తీవ్రంగా గాయపడ్డారు.

బాంబు దాడిలో చనిపోయిన వారంతా షియా వర్గం వారే కాబట్టి బాంబులు పేల్చింది సున్నీ వర్గీయులే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే ఉగ్రవాద గ్రూపు ప్రకటించింది. ఐఎస్ అంటే తాలిబన్లకు బద్ధ విరోధి గా చెప్పుకోవచ్చు. నిజానికి తాలిబన్లపై తాము పై చేయి సాధించాలంటే తాలిబన్లపైన దాడులు చేయాలి కానీ ఏ పాపం తెలీని అమాయకులపైన దాడి చేయటం ఏమిటే ఐఎస్ కే తెలియాలి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే షియాలను టార్గెట్లుగా చేసుకుని ఐఎస్ గ్రూపు చాలా దాడులు చేసింది. షియాలు ఆప్ఘన్లో మైనారిటిలన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఏ విధంగా చూసుకున్నా సున్నీ వర్గానిదే ఆధిపత్యం. మరి ఈ విషయం అందరికీ ఇంత స్పష్టంగా కనబడుతున్నా ఇంకా షియాలపై దాడులు చేస్తున్నారంటే ఉగ్రవాదం అన్నది పాము వ్యవహారంలా తయారైపోయిందని అర్ధమవుతోంది. పాము కూడా ఆకలేస్తే తన పిల్లలను తానే తినేసినట్లు ఉగ్రవాదం కూడా సొంతింటికే నిప్పు పెట్టుకోవటానికి వెనకాడటం లేదని అర్ధమైపోతోంది.

This post was last modified on October 9, 2021 12:02 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago