Political News

రికార్డు మెజార్టీతో బంప‌ర్ విక్ట‌రీ కొట్టిన మ‌మ‌తా బెన‌ర్జీ


దేశవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప‌శ్చిమ బెంగాల్ ఉప ఎన్నిక‌ల‌లో అధికార టీఎంసీ ఘ‌న‌విజ‌యం సాధించింది. కొద్ది నెల‌ల క్రితం అక్క‌డ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో డ‌బుల్ సెంచ‌రీతో వ‌రుస‌గా మూడోసారి సీఎం పీఠం ద‌క్కించుకుంది మ‌మ‌తా బెన‌ర్జీ. అయితే మ‌మ‌త బంప‌ర్ మెజార్టీతో మూడోసారి బెంగాల్ సీఎం అయినా కూడా నందిగ్రామ్‌లో మాత్రం ఆమె సువేందు అధికారి చేతిలో 1700 స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ ప‌ట్టుబ‌ట్టి అక్క‌డ మ‌మ‌త‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. రాష్ట్ర వ్యాప్తంగా మ‌మ‌త‌ను ట‌చ్ చేయ‌లేక‌పోయినా నందిగ్రామ్‌లో ఆమెను ఓడించ‌డం ద్వారా మాన‌సికంగా ఉప‌శ‌మ‌నం పొందింది.

ఇక బెంగాల్లో శాస‌న‌మండ‌లి లేక‌పోవ‌డంతో మ‌మ‌త ఖ‌చ్చితంగా ఆరు నెల‌ల్లో మ‌ళ్లీ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. లేక‌పోతే ఆమె సీఎం పీఠం నుంచి త‌ప్ప‌క దిగిపోవాలి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆమె త‌న కంచుకోట అయిన భ‌వానీపూర్ నుంచి రికార్డు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. దీంతో ఆమె స‌గ‌ర్వంగా అసెంబ్లీ మెట్లు ఎక్క‌బోతున్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఆమె తొలి రౌండ్ నుంచే భారీ మెజార్టీతో దూసుకు పోయారు. ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ సీపీఎం నుంచి శ్రీబిజి బిశ్వాస్ పోటీలో ఉన్నారు.

అయితే మ‌మ‌త ఎమ్మెల్యే అయ్యేందుకు భ‌వానీపూర్ నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో ఎమ్మెల్యేగా గెలిచిన శోభ‌న్‌దేవ్ ఛ‌టోపాధ్యాయ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో మ‌మ‌త ఇక్క‌డ నుంచి పోటీ చేసి సునాయాస‌న విజ‌యం అందుకున్నారు. ఇక ఈ సీటు మ‌మ‌తే. గ‌తంలో ఆమె ఇక్క‌డ సాధించిన మెజార్టీని అధిగ‌మించి ఈ సారి ఏకంగా 58 వేల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ఇక బెంగాల్లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జాంగీపూర్‌, శంషేర్ గంజ్ స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది.

ఇక్క‌డ నుంచి బీజేపీ లోక్‌స‌భ ఎంపీలుగా ఉన్న నేత‌లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంత‌రం వారు ఎంపీలుగా ఉండేందుకే ఇష్ట‌ప‌డి త‌మ ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకున్నారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ టీఎంసీ భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతూ బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.

This post was last modified on October 3, 2021 5:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

4 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

57 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago