Political News

ఏపీలో రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు: ప‌వ‌న్ ఎఫెక్టేనా?

ఏపీలో హ‌ఠాత్ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని ర‌హ‌దారుల‌కు ఈ రోజు ఉద‌యం నుంచి మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించారు. ఇది ఏ ఒక్క‌చోటో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా.. దెబ్బ‌తిన్న ప్ర‌ధాన రోడ్ల‌కు.. మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్నారు. హుటాహుటిన తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుల ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ అధికారులు.. ద‌గ్గ‌రుండి మ‌రీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఇళ్ల‌కే ప‌రిమిత‌మైనా.. ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇది జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ ఘ‌నతేన‌ని అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల ఏపీకి సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా గ‌త నెల నుంచి కూడా ఆయ‌న రోడ్ల విష‌యంలో ఆయ‌న సీరియ‌స్‌గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చెడిపోయాయ‌ని.. అయినప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని రోడ్ల దుస్తితిపై ప్ర‌తి ఒక్కరూ స్పందించాలంటూ.. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్నాళ్ల కింద‌ట పిలుపునిచ్చారు. దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఫొటోలు జ‌న‌సేన ట్విట్ట‌ర్‌ను నింపేశాయి. ఈ క్ర‌మంలో ఆయా ఫొటోల‌ను మీడియాకు కూడా చూపించారు.

ఇక, ఈ క్ర‌మంలోనే మ‌రో రెండు రోజుల్లో శ‌నివారం నుంచి అక్టోబ‌రు 2, గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆయ‌న ఏపీ వ్యాప్తంగా ఉన్న ర‌హ‌దారులను బాగు చేసేందుకు ఉద్య‌మం చేప‌ట్టారు. దీనికి సంబంధించి తాను స్వ‌యంగా రెండు చోట్ల పాల్గొని వాటిని బాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాజ‌మండ్రి, అనంత పురంలోని ర‌హ‌దాల‌ను ఎంచుకున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌నసైనికుల‌కు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. ఇది తీవ్ర ఉద్య‌మం రూపం దాలుస్తుండ‌డంతో.. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే క‌దిలిం ది.

హుటాహుటిన రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు ప్రారంభించింది. ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల‌ను బాగు చేస్తోంది. మరీ ముఖ్యంగా ప‌వ‌న్ ప‌ర్య‌టించిన ప్రాంతాల్లో రోడ్ల‌ను వెంట‌నే పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధ‌మయ్యారు. ఉద‌యం నుంచి రంగంలోకి దిగి.. రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నారు. అయితే.. ఇది చూస్తున్న ప్ర‌జ‌లు మాత్రం.. రాజ‌కీయ వివాదం ఎలా ఉన్నా.. ప‌వ‌న్ దెబ్బ‌తో రోడ్లు బాగుప‌డుతున్నాయ‌ని సంబ‌ర ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 29, 2021 6:28 pm

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

11 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

54 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago