రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యల మంట ఇంకా మండుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద పవన్ చేసిన కామెంట్స్కి కౌంటర్ వేసేందుకు పోసాని సోమవారం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా మరో ప్రెస్మీట్ను నిర్వహించారాయన. మొదటి రోజు ప్రెస్మీట్ కాస్త బ్యాలెన్స్డ్గానే ఉన్నా.. రెండో రోజు మాత్రం ఆయన కాస్త కంట్రోల్ తప్పి మాట్లాడ్డం అందరినీ షాక్కి గురి చేసింది.
కూల్గానే మొదలుపెట్టిన పోసాని.. కాసేపటికి తిట్ల దండకం అందుకున్నారు. బూతులు మాట్లాడుతూ పవన్ మీద విరుచుకుపడ్డారు. నోటితో పలకడానికి, రాయడానికి వీలు కాని మాటలు ఆయన నోట్లో నుంచి రావడంతో అందరూ విస్తుపోయారు. వీధుల్లో కొట్టుకునేవారు సైతం ఈ స్థాయిలో మాట్లాడరు అని కొందరు కామెంట్ చేయడాన్ని బట్టి ఆయన ఎంతగా నోరు జారారో అర్థం చేసుకోవచ్చు.
పవన్ని రాజకీయ పరంగా విమర్శించడంలో తప్పు లేదు. ఆయన అన్న మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలోనూ తప్పేమీ లేదు. కానీ పవన్ చెడ్డవాడని నిరూపించే క్రమంలో భార్యాబిడ్డల్ని లాగడం మాత్రం సమంజసనీయం కాదు. పోసాని ఆ పని చేసి తన గౌరవాన్ని తనే తగ్గించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూతుర్ని సైతం ఆయన ఈ రచ్చలోకి లాగడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోసాని మంచి రచయిత. మంచి భాషాజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విమర్శించాలి అనుకుంటే బూతులే వాడక్కర్లేదు. అవతలివారు సమాధానం చెప్పలేని స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించగలరు. కానీ పవన్ని విజ్ఞతతో మాట్లాడమని చెప్పిన ఆయనే చివరికి విజ్ఞతను మర్చిపోయి లైవ్లో బూతులు మాట్లాడటం షాక్కి గురి చేసింది. కనీసం వాటిని ఎడిట్ కూడా చేయకుండా చానెల్స్ ప్రసారం చేయడంతో క్షణాల్లో దీనిపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
మొన్న పోసాని మాటలకు పీకే అభిమానులు మాత్రమే హర్టయ్యారు. మిగతావాళ్లు ఎప్పుడూ ఉండే గొడవలేగా అన్నట్టు చూసి వదిలేశారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నారు. కానీ ఇప్పుడు పోసాని ఇంత దిగజారి మాట్లాడిన తర్వాత ఇది ఏ స్థాయికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్లి ఆగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
This post was last modified on September 29, 2021 6:12 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…