Political News

నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు

‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా వైసీపీ నేతలపై ఓ రేంజ్లో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యల ప్రకంపనలు.. ఏపీ అధికారపార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు. సన్నాసి అంటూ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయిన పవన్ ను.. మంత్రులు పలువురు అంతే ఘాటుగా రియాక్టు అయ్యారు. శనివారం రాత్రి పవన్ విమర్శల ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దానికి ప్రతిస్పందనలు పెద్ద ఎత్తున ఆదివారం మొత్తం సాగాయి.

ఇలాంటి వేళ.. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ సర్కారులోని డొల్లతనాన్ని ఎత్తి చూపేలా పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. ‘ప్రజల మీద పన్నులు రుద్ది.. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవరత్నాలు’ భావితరాలకు ‘నవకష్టాలు’ అంటూ వైసీపీ సర్కారు తీరును తప్పు పట్టారు.

ఏదో ట్వీట్ చేశామంటే చేశామన్నట్లు కాకుండా.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. చేస్తున్న పనులు అంటూ ఒక లిస్టును తన ట్వీట్ కు జత చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చర్యలుగా ఏమేం చేస్తున్నారన్న వాదనను తెలిపేలా పోస్టు ఉంది.

మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని.. నియంత్రిస్తామని చెప్పి.. మద్యంతో వచ్చే ఆదాయాల్ని సెక్యురిటీగా చూపించి రుణాలు తీసుకుంటున్నారన్నారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. ఛార్జీల భారాన్ని మోపారన్నారు. ప్రతి ఏటా 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇంతకాలానికి కేవలం 450 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేశారన్నారు. గ్రూప్ 1-2 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు కేవలం 36 మాత్రమే భర్తీ చేశారన్నారు. ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయలేదన్నారు.

అక్రమ మైనింగ్ మీద ఉక్కుపాదం మోపుతామని.. ఇసుక ధరల్ని తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇసుక తవ్వకాల్ని ప్రైవేటుకు కట్టబెట్టారన్నారు. పారదర్శక పాలనను మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరకు జీవోల్ని పబ్లిష్ చేసే వెబ్ సైట్ ను నిలిపేశారు. బలమైన రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అసలు రాజధానే లేకుండా చేశారు. కన్ఫ్యూజన్.. కోర్టులు.. కేసులతో సరిపెడుతున్నారంటూ ట్వీట్ లో విమర్శల్ని గుప్పించారు.

This post was last modified on September 27, 2021 12:03 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago