Political News

పవన్ వ్యూహం ఇదేనా ?

విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుపెట్టుకుని జనసేన చేస్తున్న హడావుడి వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లుంది. ఇపుడు కాకపోయినా కొద్దిరోజుల తర్వాతైనా పాలనా రాజధానిగా విశాఖకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాన్ గ్రహించినట్లున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లా నుండే మళ్ళీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట.

పవన్ దృష్టిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గాజువాక తో పాటు భీమిలీ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తిప్పలనాగిరెడ్డి చేతిలో పవన్ సుమారు 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలైపోయిన దగ్గర నుండి మళ్ళీ పవన్ నియోజకవర్గం మొహమే చూడలేదు. అలాంటిది హఠాత్తుగా జనసేన తరపున వైజాగ్ లో హడావుడి పెరిగిపోయింది.

అధినేత పవన్ తరపున నాదెండ్ల మనోహర్ వైజాగ్ లో క్యాంపు వేసి మరీ హడావుడి మొదలుపెట్టారు. వైజాగ్ లో కార్యక్రమాలు ఎలా మొదలుపెట్టాలా అని చూస్తున్న జనసేన నేతలకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అచ్చివచ్చింది. దాంతో స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులతో నాదెండ్ల వరుసబెట్టి సమావేశాలు నిర్వహించేస్తున్నారు. కార్మిక, ఉద్యోగసంఘాలకు జనసేన తరపున పవన్ భరోసా ఎప్పుడూ ఉంటుందని నాదెండ్ల హామీఇచ్చేశారు.

పవన్ తొందరలోనే వైజాగ్ వస్తారని, కార్మికులు, ఉద్యోగుల తరపున ప్రత్యేకంగా కార్యాచరణ మొదలుపెడతారంటు ప్రకటించేశారు. నాదెండ్ల ప్రకటనలు, భేటీలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ మళ్ళీ ఇదే జిల్లానుండి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న పద్దతిలో మళ్ళీ గాజువాక నుండే పోటీచేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయట. ఒకవేళ చివరి నిముషంలో నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సొస్తే భీమిలీలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.

భీమిలీలో ప్రస్తుతం వైసీపీ తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయన టీడీపీ అభ్యర్ధి సబ్బంహరిని సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే హఠాత్తుగా సబ్బం మరణించటంతో ఇక్కడ టీడీపీకి గట్టి అభ్యర్ధి కరువయ్యారు. ఒకవేళ టీడీపీతో పొత్తుంటే చాలా ఈజీగా భీమిలీలో తాను గెలవచ్చని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on September 26, 2021 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

18 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

58 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago