తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పం నియోజకవర్గం కన్నా మరో 12 నియోజకవర్గాలే బెటర్ రిజల్ట్సు సాధించినట్లే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలుంటే టీడీపీ గలిచింది ముచ్చటగా మూడంటే 3 ఎంపీటీసీలు మాత్రమే అని అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలాంటి ఫలితాలు రావటం చాలా విచిత్రమనే చెప్పాలి. నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలుంటే నాలుగు జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకున్నది.
నాలుగు జడ్పీటీసీలతో పాటు ఏకంగా 63 మంది ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకోవటమంటే మామల విషయంకాదు. టీడీపీ కంచుకోట కుప్పం కోటకు భారీ బీటలు వారినట్లే అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి పంచాయితీల్లో కూడా వైసీపీ మద్దతుదారులే మొత్తం గెలుచుకున్నారు. దశాబ్దాలుగా ఎన్నిక ఏదైనా టీడీపీ అభ్యర్ధులు మాత్రమే గెలిచేవారు. అలాంటి పరిస్ధితి నుండి ఇపుడు అన్నింటిలోను తుడిచిపెట్టుకుపోవటమంటే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు అనుకోవాలి. అలాగే కుప్పం పరిస్ధితిని ఇతర నియోజకవర్గాల్లో పోలుస్తు కథనాలు వస్తున్నాయి.
కుప్పంతో పోల్చుకుంటే మరో 12 నియోజకవర్గాల్లో టీడీపీ మంచి ఫలితాలనే రాబట్టింది. అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలినే తీసుకుంటే 78 ఎంపీటీసీల్లో 4 గెలుచుకుంది. నందమూరి బాలకృఫ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురంలో 43 ఎంపీటీసీల్లో 7 చోట్ల గెలిచింది. అత్యధికంగా మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నియోజకవర్గం పొన్నూరులోని 53 ఎంపీటీసీలుంటే 12 చోట్ల గెలిచింది. తర్వాత రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో 41 ఎంపీటీసీలకు గాను 11 చోట్ల గెలిచింది.
కుప్పంకన్నా కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఫలితాలనే ఎందుకు రాబట్టింది ? ఎందుకంటే జనాలతో టచ్ లో ఉండటమే కారణంగా చెప్పుకోవాలి. జనాలంటే స్ధానిక ప్రజలే కాకుండా పార్టీలో నేతలు, కార్యకర్తలు కూడా. నిత్యం జనాల్లోనే ఉండే నేతలకు జనాలతో పాటు పార్టీలో మంచి ఇమిజి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక్కడ కుప్పం పరిస్దితిని గమనిస్తే నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటంచటంలేదు. కరోనా వైరస్ కారణంగా ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎంతో అవసరమైతే కానీ చంద్రబాబు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు.
తన నియోజకవర్గంలోని నేతలను కూడా జూమ్ యాప్ ద్వారానే పలకరిస్తున్నారు. చంద్రబాబు కన్నా బావమరది కమ్ వియ్యంకుడు బాలకృఫ్ణ కూడా ఓకే అన్నట్లున్నారు. తన నియోజకవర్లో ఏడు ఎంపీటీసీల్లో గెలవటం గొప్పే. బాలకృష్ణ కూడా నియోజకవర్గంలో ఏదో చుట్టపు చూపులాగ వచ్చి వెళ్ళిపోతుంటారు. కాకపోతే బాలకృష్ణ తరపున అనేకన్నా పార్టీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు.
This post was last modified on September 22, 2021 11:05 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…