Political News

లైట్ తీసుకున్నాం.. విధ్వంసం జరుగుతోంది

దేశవ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ నామమాత్రంగా నడుస్తోంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపులు రాగానే కరోనా ప్రభావం తగ్గిపోయిందేమో అన్నట్లుగా జనాలు వైరస్‌ ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతుంటే.. ఒకరిద్దరు చనిపోతుంటేనే వణికిపోయిన జనాలు.. ఇప్పుడు వందలు వేలల్లో కేసులు వెలుగు చూస్తున్నా, పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నా మామూలు విషయం లాగే చూసే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. నిన్న, శుక్రవారం పలు రాష్ట్రాల్లో హైయెస్ట్ సింగిల్ డే కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలో తెలంగాణ సైతం ఉంది. దేశంలోనే అతి తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్న తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇప్పటిదాకా తెలంగాణలో ఏ రోజూ వందకు పైగా కేసులు నమోదు కాలేదు.

నిన్న దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు హైయెస్ట్ సింగిల్ డే కేసులతో రికార్డులు నమోదు చేశాయి. మహారాష్ట్రలో ఏకంగా 2600కు పైగా కేసులు బయటపడటం గమనార్హం. తమిళనాడులో 800కు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్న ఒక్క రోజే 8 వేలకు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటిదాకా ఏ రోజూ 8 వేల మార్కుకు చేరలేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 150 మందికి పైగా చనిపోయారు.

మొత్తం మరణాల సంఖ్య 5 వేల మార్కును టచ్ చేసింది. ఐతే కొంత ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. నిన్న రికార్డు స్థాయి కేసులే కాదు.. రికార్డు స్థాయి రికవరీలు కూడా ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే 11 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా దేశంలో కరోనా కేుసులు 1.73 లక్షలకు పైగా ఉండగా అందులో 90 వేల మంది దాకా కోలుకున్నారు. కానీ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమే.

This post was last modified on May 30, 2020 7:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అరటి దొంగకు తీహార్ జైలా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో…

1 hour ago

సరస్వతి వివాదంలో ఎవరు రైట్

నిన్న విడుదలైన ఎస్ సర్వసతి సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది. దీనికి కథను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా…

2 hours ago

మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!

వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో…

2 hours ago

గద్దర్ అవార్డులు.. భలే భలే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రమం తప్పకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తూ వచ్చిన నంది అవార్డులకు.. రాష్ట్ర విభజన తర్వాత బ్రేక్…

3 hours ago

శత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారం

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది…

4 hours ago

కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా

హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్…

4 hours ago