Political News

ప్రజా వ్యతిరేకత అర్ధమవుతోందా ?

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు జనాల్లో వ్యతిరేకత అర్ధమవుతోందా? అన్న అనుమానం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రుపానీ రాజీనామా చేసేయడమే. రూపానితో పాటు యావత్ మంత్రివర్గం తో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించేసింది. ఇక్కడ అధిష్టానం అంటే కేవలం నరేంద్ర మోదీ మాత్రమే అని అందరు అర్థం చేసుకోవాలి. గడచిన ఐదేళ్ళుగా సీఎంగా ఉన్న రూపానీతో ఇంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేయించినట్లు ?

రూపానీపై చాలాకాలంగా ఆరోపణలు, అసంతృప్తులు ఉన్నాయట. రూపానీతో పాటు ఆయన మంత్రివర్గంలోని చాలామందిపై జనాల్లో అసంతృప్తి బాగా పెరిగిపోతోందట. తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రూపాని పాలనలోని అసంతృప్తితో పాటు కేంద్రంలోని మోదీ పాలనపైన కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. రెండు కలిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని మోడీకి అర్ధమైపోయింది. అందుకనే హఠాత్తుగా రూపానీతో రాజీనామా చేయించేశారు. తొందరలోనే కొత్త సీఎం+మంత్రులను ఎంపిక చేస్తారు.

మొన్నటికి మొన్న కర్ణాటకలో యడ్యూరప్పతో కూడా ఇలాగే రాజీనామా చేయించేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. యడ్యూరప్ప పైన కూడా అవినీతి ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. అలాగే యడ్డీపై చాలా మంత్రుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీని ఫలితంగా జనాల్లో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మోడీ దిద్దుబాటు చర్యలకు దిగారు.

ఇందులో భాగంగానే యడ్డీతో రాజీనామా చేయించేశారు. మంత్రుల్లో కూడా చాలామందిని మార్చేశారు. సరే కొత్తగా కొలువైన బొమ్మై పై మంత్రులు, ఎంఎల్ఏల్లోనే అసంతృప్తి పెరిగిపోయింది. బొమ్మై సీఎం అయిన నాలుగు రోజులకే శాఖలపై కొందరు మంత్రుల్లో అసంతృప్తి బహిరంగంగానే బయటపడింది. దాంతో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు సీఎంకు వ్యతిరేకమైపోయారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచేది అనుమానమనే అభిప్రాయం పెరిగిపోతోంది.

అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎంను కూడా ఇలాగే మార్చేశారు. మొత్తం మీద బీజేపీ పాలిత రాష్ట్రాలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్న విషయాన్ని మోదీ గ్రహించినట్లే ఉన్నారు. ఎందుకంటే ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం, పాండిచ్చేరిలో తప్ప ఇంకెక్కడా అధికారంలోకి రాలేకపోయింది. పశ్చిమబెంగాల్లో పరిస్ధితిని మెరుగుపరుచుకున్నా ఓటమి తప్పలేదు. అలాగే కేరళ, తమిళనాడులో కూడా ఓడిపోయింది. మొత్తం మీద జనాల వ్యతిరేకతను మోడి గుర్తిస్తున్నారనేందుకు సీఎంల మార్పే నిదర్శనమని చెప్పాలి.

This post was last modified on September 12, 2021 4:06 pm

Share
Show comments

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

52 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago