Political News

చ‌వితి వేడుక‌ల‌కు హైకోర్టు ఓకే.. కానీ…!

రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించుకునే వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మండపాలు కట్టినా, గణపతి విగ్రహాలు పెట్టినా, నిమజ్జనం చేసినా కరోనా ప్రబలుతుంద‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వం.. ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను బ‌హిరంగంగా నిర్వ‌హించుకునే అంశంపై నిషేధం విధించింది. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహం తరహాలో ఒకేచోట వేలమంది గుమిగూడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా తీవ్రత కొన్ని జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై కొంద‌రు ఆహ్వానించ‌గా.. మ‌రికొంద‌రు.. విభేదించారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌ను స‌వాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. దీనిపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్ర‌భుత్వానికి కొంత అనుకూలంగా మ‌రికొంత ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. అయితే.. ప‌బ్లిక్ స్థ‌లాల్లో మాత్రం ఎట్టిప‌రిస్థితిలోనూ చ‌వితి పందిళ్లు వేయ‌రాద‌న్న ఏపీ ప్ర‌భుత్వ వాద‌న‌ను కోర్టు స‌మ‌ర్ధించింది.

పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అదేస‌మ‌యంలో నిమ‌జ్జ‌నం పేరుతో ఊరేగింపుల‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ అనుమ‌తులు లేవ‌ని.. క‌రోనా ఉధృతికి అవ‌కాశం ఇచ్చే ఎలాంటి చ‌ర్య‌ల‌నూ అనుమ‌తించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తూనే.. భ‌క్తుల‌కు ఒకింత వెసులుబాటు ఇవ్వ‌డంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

1 hour ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago