ఈ మధ్య తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అలవాటుగా మారిపోయింది. జగన్ సర్కారు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి సంబరాలకు అనుమతి నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ పండుగను సెంటిమెంటుగా భావించే హిందువులకు రుచించడం లేదు. కరోనా ప్రభావం చాలా వరకు తగ్గిన నేపథ్యంలో కొన్ని పరిమితుల మధ్య పండుగ జరుపుకుంటామని జనాలు అంటుంటే.. అసలు వేడుకలే వద్దంటూ ప్రభుత్వం షరతులు పెట్టడంపై వివాదం రాజుకుంది.
ముఖ్యంగా వినాయకుడి విగ్రహాలు అమ్ముతున్న చిరు వ్యాపారుల ప్రభుత్వ అధికారులు జులుం చూపించడం.. గుంటూరులో ఒక చోట దేవుడి విగ్రహాలను స్వాధీనం చేసుకుని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లడం జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వ తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు.
కొవిడ్ పేరు చెప్పి వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధించడాన్ని పవన్ తప్పుబట్టాడు. పక్క రాష్ట్రాల్లో కొన్ని షరతుల మధ్య చవితి ఉత్సవాలు జరుగుతున్నపుడు, ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నపుడు ఏపీలో మాత్రం ఈ నియంత్రణ ఏమిటని పవన్ ప్రశ్నించాడు.
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ నాయకులు ఏ వేడుకల్లో పాల్గొన్నా, వాళ్లు ఏం చేయాలనుకున్నా కరోనా అడ్డం కాదని.. వాటికి అనుమతులు వస్తాయని.. కానీ మన సంస్కృతిలో భాగమైన వినాయక చవితి చేసుకోవాలంటే మాత్రం కరోనాను చూపిస్తున్నారని.. ఇలా పక్షపాతం ప్రదర్శించడం ఎంత వరకు న్యాయమని పవన్ ప్రశ్నించాడు. కొవిడ్ మార్గదర్శకాలు అన్నింటికీ ఒకేలా ఉండాలని.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రకమైన నిబంధనలు సరికాదని.. వినాయక చవితిని కొన్ని షరతుల మధ్య జరుపుకునేలా అనుమతులు మంజూరు చేయాలని పవన్ డిమాండ్ చేశాడు.
This post was last modified on September 8, 2021 10:22 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…