Political News

బిగ్ బ్రేకింగ్.. ఏపీ సీఈసీ రీఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేుష్ కుమార్‌ను తిరిగి ఆ పదవిలో నియమించాలని ఆదేశఆలు జారీ చేసింది. రమేష్ కుమార్‌ను తప్పించడం కోసమే జగన్ సర్కారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నియామకం, పదవీకాలం విషయమై కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. రమేశ్‌ కుమార్‌ను తిరిగి కమిషనర్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని రమేశ్‌ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించి ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ప్రభుత్వానికి, సీఈసీ రమేష్ కుమార్‌కు మధ్య రగడ మొదలైంది. కరోనా వ్యాప్తి పెరుగుతుందన్న కారణం చూపి ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా ఆక్షేపించింది. రమేష్ కుమార్ చంద్రబాబు తొత్తు అని ఆరోపిస్తూ ఆయనకు కుల జాఢ్యాన్ని కూడా ఆపాదించారు.
జగన్‌తో పాటు పలువురు వైకాపా నాయకులు రమేష్ కుమార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి మరీ రమేష్ కుమార్‌ను పదవి నుంచి తప్పించింది ప్రభుత్వం.

ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన కనకరాజ్‌ను తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టారు. ఐతే తనపై వేటు పడ్డ వెంటనే రమేష్ కుమార్ కోర్టు గడప తొక్కారు. దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి తనను తప్పించిందంటూ పిటిషన్ వేయగా.. ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.

This post was last modified on May 29, 2020 12:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

2 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

3 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

4 hours ago

ఇక‌… బీజేపీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే జ‌గ‌న్‌.. !

కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుంద‌న్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…

5 hours ago

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…

7 hours ago

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో..…

8 hours ago