కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా ఉబకాయం బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా.. ఫిట్ గా లేకపోవటం కంపెనీకి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా చూసినప్పుడు జిరోదా పెద్ద కంపెనీనే కాదు. చాలా చిన్నది. అయితే.. ఆలోచనలో మాత్రం పెద్ద కంపెనీలు కూడా చేయలేని ఆలోచన చేసింది.
ఉద్యోగులు ఫిట్ గా ఉండాలని పేర్కొన్న కంపెనీ.. సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా ఉంటే ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఈ చాలెంజ్ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. కరోనా.. లాక్ డౌన్.. వర్కుఫ్రం హోం తదితర కారణాలతో ఉద్యోగులు శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని.. వారి ఆహార అలవాట్లు.. జీవన విధానంలో మార్పు వచ్చిన వైనాన్ని ప్రస్తావించిన సీఈవో నితిన్ కామత్.. వారిని అందులో నుంచి బయటపడేసేందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మరి.. సంస్థ విసిరిన సవాలుకు ఎంత మంది ఉద్యోగులు స్పందిస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. ఇదే తీరును మిగిలిన కంపెనీలు సైతం ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…