కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా ఉబకాయం బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా.. ఫిట్ గా లేకపోవటం కంపెనీకి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా చూసినప్పుడు జిరోదా పెద్ద కంపెనీనే కాదు. చాలా చిన్నది. అయితే.. ఆలోచనలో మాత్రం పెద్ద కంపెనీలు కూడా చేయలేని ఆలోచన చేసింది.
ఉద్యోగులు ఫిట్ గా ఉండాలని పేర్కొన్న కంపెనీ.. సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా ఉంటే ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఈ చాలెంజ్ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. కరోనా.. లాక్ డౌన్.. వర్కుఫ్రం హోం తదితర కారణాలతో ఉద్యోగులు శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని.. వారి ఆహార అలవాట్లు.. జీవన విధానంలో మార్పు వచ్చిన వైనాన్ని ప్రస్తావించిన సీఈవో నితిన్ కామత్.. వారిని అందులో నుంచి బయటపడేసేందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మరి.. సంస్థ విసిరిన సవాలుకు ఎంత మంది ఉద్యోగులు స్పందిస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. ఇదే తీరును మిగిలిన కంపెనీలు సైతం ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on August 31, 2021 7:37 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…