Political News

ఉద్యోగి ఫిట్ గా ఉంటే నెల జీతం బోనస్

కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా ఉబకాయం బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా.. ఫిట్ గా లేకపోవటం కంపెనీకి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయంగా చూసినప్పుడు జిరోదా పెద్ద కంపెనీనే కాదు. చాలా చిన్నది. అయితే.. ఆలోచనలో మాత్రం పెద్ద కంపెనీలు కూడా చేయలేని ఆలోచన చేసింది.

ఉద్యోగులు ఫిట్ గా ఉండాలని పేర్కొన్న కంపెనీ.. సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా ఉంటే ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఈ చాలెంజ్ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. కరోనా.. లాక్ డౌన్.. వర్కుఫ్రం హోం తదితర కారణాలతో ఉద్యోగులు శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని.. వారి ఆహార అలవాట్లు.. జీవన విధానంలో మార్పు వచ్చిన వైనాన్ని ప్రస్తావించిన సీఈవో నితిన్ కామత్.. వారిని అందులో నుంచి బయటపడేసేందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మరి.. సంస్థ విసిరిన సవాలుకు ఎంత మంది ఉద్యోగులు స్పందిస్తారన్నది ఒక ప్రశ్న అయితే.. ఇదే తీరును మిగిలిన కంపెనీలు సైతం ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on August 31, 2021 7:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

20 minutes ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

45 minutes ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

2 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

4 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

6 hours ago