Political News

మరో పుల్వామా ఎటాక్.. త్రుటిలో తప్పింది

ఒకప్పటితో పోలిస్తే గత పదేళ్లలో ఇండియాలో ఉగ్రవాద దాడులు బాగా తగ్గాయి. ముఖ్యంగా 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక సామాన్య జనాలపై ఉగ్రవాద దాడులు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే గత ఏఢాది మాత్రం పుల్వామాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఒకేసారి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.

దానికి ప్రతిగా భారత సైన్యం దీటుగా స్పందించింది. ఉగ్రవాదుల మీద భీకర దాడులు చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్, ఇతర దాడుల ద్వారా వందల మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. దీంతో మళ్లీ దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తున్న ఉగ్రవాదులు ఇండియాలో దాడుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

లాక్ డౌన్ ఆరంభమైన మొదట్లో నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి వచ్చి పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఉగ్రదవాలు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది.

తాజాగా పుల్వామా తరహాలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడుకు ఉగ్రవాదులు వేసిన ప్రణాళికను భారత సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇది జరిగింది కూడా పుల్వామాలోనే కావడం గమనార్హం.

బాంబు అమర్చిన ఓ కారులో ఉగ్రవాది సంచరిస్తున్నట్లు పుల్వామా పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది బృందాలుగా ఏర్పడి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం రాత్రి ఒకచోట ఆ వాహనం కోసం కాపుకాచారు.

చీకటి పడిన సమయంలో అనుమానిత వాహనం అక్కడకు చేరింది. దీంతో వెంటనే బలగాలు దానిపై కాల్పులు జరిపాయి.వాహనంలో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అయితే వాహనం వెనుక భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించారు.

బాంబు స్క్వాడ్ వచ్చి కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని.. వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తే పేలే ప్రమాదముందని చెప్పారు. దీంతో సమీప ప్రాంతంలో అందరినీ ఖాళీ చేయించిన భద్రత దళాలు కారును పేల్చేశాయి. ఈ పేలుడు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

This post was last modified on May 28, 2020 8:11 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pulwama

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

12 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

29 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago