టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పలువురికి నోటీసులు కూడా అందాయి. కాగా.. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈడీ నోటీసులు అందిన వారిలో కేటీఆర్ సన్నిహితులున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు సైతం డ్రగ్స్ కేసు పై భయపడుతున్నారని… ఈడీ …విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఎంటి ? అని ఆయన ప్రశ్నించారు . అసలు డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనే విషయం తనకు సంబంధం లేదని..డ్రగ్స్ కేసుపై మాత్రం విచారణ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అసలు గోవాకి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. డ్రగ్స్ తో పిల్లల జీవితం సర్వ నాశనం అవుతుందని రేవంత్ అన్నారు. అప్పట్లో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పలువురిని అకున్ సబర్వాల్ విడిచిపెట్టారని.. ఆతర్వాత కొన్ని రోజులకే కేసు మూసేశారని రేవంత్ గుర్తుచేశారు.
This post was last modified on August 27, 2021 10:38 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…