టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పలువురికి నోటీసులు కూడా అందాయి. కాగా.. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈడీ నోటీసులు అందిన వారిలో కేటీఆర్ సన్నిహితులున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు సైతం డ్రగ్స్ కేసు పై భయపడుతున్నారని… ఈడీ …విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఎంటి ? అని ఆయన ప్రశ్నించారు . అసలు డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనే విషయం తనకు సంబంధం లేదని..డ్రగ్స్ కేసుపై మాత్రం విచారణ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అసలు గోవాకి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. డ్రగ్స్ తో పిల్లల జీవితం సర్వ నాశనం అవుతుందని రేవంత్ అన్నారు. అప్పట్లో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పలువురిని అకున్ సబర్వాల్ విడిచిపెట్టారని.. ఆతర్వాత కొన్ని రోజులకే కేసు మూసేశారని రేవంత్ గుర్తుచేశారు.
This post was last modified on August 27, 2021 10:38 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…