Political News

కేసీఆర్ పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ ?

దళిత బంధు పథకం లాంటిదే భవిష్యత్తులో అన్ని వర్గాల కోసం తలో బంధు పథకం ప్రవేశపెట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చూస్తుంటే దళిత బంధు పథకం పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ బాగానే పని చేసినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం టార్గెట్ గా కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించారో వెంటనే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బీసీలతో పాటు ఇతర వర్గాలకు కూడా బంధు పథకాన్ని తేవాలని పదే పదే డిమాండ్ చేశాయి.

అసలే ఉప ఎన్నికలో గెలుపు టార్గెట్ గా తీసుకొచ్చిన పథకం దళిత బంధు. హుజూరాబాద్ లో ఎస్సీ ఓట్లు సుమారు 45 వేల దాకా ఉన్నాయి. అలాగే బీసీల ఓట్లు కూడా లక్షకుపైగా ఉన్నాయి. ఇక రెడ్ల ఓట్లు తక్కువేమీ కాదు. కాకపోతే మైనారిటీల ఓట్లు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఎస్సీల విషయంలో మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారంటూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే కేసీయార్ ను టార్గెట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదలకోసం దళిత బంధు పథకం లాంటిది కేసీయార్ ఎందుకని పెట్టడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. దళిత బంధు పథకం కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే తెచ్చిన తాత్కాలిక పథకంగా రేవంత్, బండి ఇద్దరు చెరోవైపు నుండి కేసీయార్ ను వాయించేస్తున్నారు. ఇదే విషయమై జనాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

దాంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ కేసీఆర్ దృష్టికి వచ్చినట్లుంది. అందుకనే ఈరోజు పార్టీ ఆఫీస్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల కోసం దళితబంధు పథకాన్ని తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల కోసం పేదల బంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

దళిత బంధు పథకం అమలు ద్వారా మిగిలిన సామాజిక వర్గాల్లో జరగబోయే నష్ట నివారణ కోసమే కేసీఆర్ అర్జెంటుగా పేదల బంధు పథకాన్ని ప్రకటించినట్లు అర్థమైపోతోంది. అంటే రేవంత్, బండి ఒత్తిడి కేసీఆర్ మీద బాగానే పనిచేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించిన పేదల బంధు పథకాలు ఎంతవరకు అమలవుతాయో చూడాల్సిందే.

This post was last modified on August 25, 2021 10:56 am

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago