కరోనా మహమ్మారి ధాటికి గత ఏడాదిన్నర కాలంలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే ఈ వైరస్ కారణంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోవడం కోట్లాది మంది అభిమానులను ఎంత వేదనకు గురి చేసిందో తెలిసిందే. కొందరు ప్రముఖులు ప్రాణాల మీదికి తెచ్చుకుని త్రుటిలో బయటపడ్డారు. టాలీవుడ్లో సీనియర్ హీరో రాజశేఖర్.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ల పరిస్థితి కూడా ఒక దశలో విషమంగా మారింది.
బండ్ల అయితే రెండుసార్లు కరోనా బారిన పడగా.. రెండో పర్యాయం తన పరిస్థితి విషమించినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు. చికిత్స విషయంలో ఒక్క రోజు ఆలస్యం జరిగినా తన ప్రాణాలు పోయి ఉండేవని… ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవే తన ప్రాణాలు కాపాడాడని.. ఒకప్పుడు తనను నిర్మాతగా నిలబెట్టి పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఇస్తే.. ఇప్పుడు చిరంజీవి తనకు ప్రాణం పోశాడని మెగా బ్రదర్స్ మీద తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశంసలు కురిపించాడు బండ్ల.
కరోనా ఫస్ట్ వేవ్లో తాను వైరస్ బారిన పడినపుడు సులువుగానే కోలుకున్నానని.. కానీ సెకండ్ వేవ్ టైంలో కరోనా సోకినపుడు తన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని బండ్ల తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై, మాట్లాడలేని స్థితికి తాను చేరుకున్నానని బండ్ల వెల్లడించాడు. ఐతే ఆసుపత్రిలో చేరదామనుకుంటే హైదరాబాద్లో ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేవని.. అపోలో ఆసుపత్రికి ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్లకు కూడా బెడ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాధానం వచ్చిందని చెప్పాడు.
పవన్ కళ్యాణ్కు ఫోన్ చేద్దామంటే ఆయనకు కూడా కరోనా బారిన పడ్డారని.. ఆ స్థితిలో చిరంజీవికి ఫోన్ చేస్తే రెండు రింగులకే కాల్ తీసి మాట్లాడారని.. తన పరిస్థితి చెబితే ఆయనే బెడ్ ఏర్పాటు చేయించి తన ప్రాణాలు నిలబెట్టారని బండ్ల తెలిపాడు. తాను ఆసుపత్రిలో చేరినప్పటికి ఊపిరితిత్తులు 80 శాతం పాడైపోయినట్లు వైద్యులు తెలిపారని.. ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే తన ప్రాణాలు పోయేవని.. కాబట్టి చిరంజీవి వల్లే తనే ప్రాణాలు నిలిచాయని బండ్ల తెలిపాడు.
This post was last modified on August 25, 2021 12:21 pm
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…