Movie News

బండ్ల గణేష్ ఊపిరితిత్తులు 80 శాతం పాడైపోయి…

కరోనా మహమ్మారి ధాటికి గత ఏడాదిన్నర కాలంలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే ఈ వైరస్ కారణంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోవడం కోట్లాది మంది అభిమానులను ఎంత వేదనకు గురి చేసిందో తెలిసిందే. కొందరు ప్రముఖులు ప్రాణాల మీదికి తెచ్చుకుని త్రుటిలో బయటపడ్డారు. టాలీవుడ్లో సీనియర్ హీరో రాజశేఖర్.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ల పరిస్థితి కూడా ఒక దశలో విషమంగా మారింది.

బండ్ల అయితే రెండుసార్లు కరోనా బారిన పడగా.. రెండో పర్యాయం తన పరిస్థితి విషమించినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు. చికిత్స విషయంలో ఒక్క రోజు ఆలస్యం జరిగినా తన ప్రాణాలు పోయి ఉండేవని… ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవే తన ప్రాణాలు కాపాడాడని.. ఒకప్పుడు తనను నిర్మాతగా నిలబెట్టి పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఇస్తే.. ఇప్పుడు చిరంజీవి తనకు ప్రాణం పోశాడని మెగా బ్రదర్స్ మీద తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశంసలు కురిపించాడు బండ్ల.

కరోనా ఫస్ట్ వేవ్‌లో తాను వైరస్ బారిన పడినపుడు సులువుగానే కోలుకున్నానని.. కానీ సెకండ్ వేవ్ టైంలో కరోనా సోకినపుడు తన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని బండ్ల తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై, మాట్లాడలేని స్థితికి తాను చేరుకున్నానని బండ్ల వెల్లడించాడు. ఐతే ఆసుపత్రిలో చేరదామనుకుంటే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేవని.. అపోలో ఆసుపత్రికి ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్లకు కూడా బెడ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాధానం వచ్చిందని చెప్పాడు.

పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేద్దామంటే ఆయనకు కూడా కరోనా బారిన పడ్డారని.. ఆ స్థితిలో చిరంజీవికి ఫోన్ చేస్తే రెండు రింగులకే కాల్ తీసి మాట్లాడారని.. తన పరిస్థితి చెబితే ఆయనే బెడ్ ఏర్పాటు చేయించి తన ప్రాణాలు నిలబెట్టారని బండ్ల తెలిపాడు. తాను ఆసుపత్రిలో చేరినప్పటికి ఊపిరితిత్తులు 80 శాతం పాడైపోయినట్లు వైద్యులు తెలిపారని.. ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే తన ప్రాణాలు పోయేవని.. కాబట్టి చిరంజీవి వల్లే తనే ప్రాణాలు నిలిచాయని బండ్ల తెలిపాడు.

This post was last modified on August 25, 2021 12:21 pm

Share
Show comments

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

8 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago