Political News

మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే..


ఆంధ్రప్రదేశ్‌‌లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా మారిపోయింది.

సైకిల్ యాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ కరోనా బాధితులకు సైకిల్లోనే తీసుకెళ్లి సరుకులు అందించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ సందర్భంలో వర్షం పడుతున్నా కూడా సైకిల్లోనే వెళ్లి సరకులు అందజేయడం విశేషం. కొందరు ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కని కొట్టి వేసినా.. సుదీర్ఘ కాలం ఇలా సైకిల్ మీద ప్రయాణిస్తూ జనాల్లో తిరగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. తాజాగా నిమ్మల రామానాయుడు తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

తన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోగా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనం నడపాల్సిన డ్రైవర్ కరోనా బారిన పడటంతో ఇంకెవరూ వాహనం నడిపేందుకు ముందుకు రాలేదని నిమ్మల రామానాయుడికి తెలిసింది. దీంతో ఆయనే స్వయంగా ఆ వాహనాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఏమీ ఆలోచించకుండా వైకుంఠ రథాన్ని నడిపారు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని విమర్శించేవాళ్లూ ఉన్నారు కానీ.. ఆ కోణంలో చూసినా ఇలా చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారన్నది ప్రశ్న. అందుకే చాలామంది నిమ్మల రామానాయుడిని ప్రశంసిస్తున్నారు.

This post was last modified on August 24, 2021 12:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

7 mins ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

11 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

1 hour ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago