ఆంధ్రప్రదేశ్లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా మారిపోయింది.
సైకిల్ యాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ కరోనా బాధితులకు సైకిల్లోనే తీసుకెళ్లి సరుకులు అందించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ సందర్భంలో వర్షం పడుతున్నా కూడా సైకిల్లోనే వెళ్లి సరకులు అందజేయడం విశేషం. కొందరు ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కని కొట్టి వేసినా.. సుదీర్ఘ కాలం ఇలా సైకిల్ మీద ప్రయాణిస్తూ జనాల్లో తిరగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. తాజాగా నిమ్మల రామానాయుడు తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
తన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోగా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనం నడపాల్సిన డ్రైవర్ కరోనా బారిన పడటంతో ఇంకెవరూ వాహనం నడిపేందుకు ముందుకు రాలేదని నిమ్మల రామానాయుడికి తెలిసింది. దీంతో ఆయనే స్వయంగా ఆ వాహనాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఏమీ ఆలోచించకుండా వైకుంఠ రథాన్ని నడిపారు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని విమర్శించేవాళ్లూ ఉన్నారు కానీ.. ఆ కోణంలో చూసినా ఇలా చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారన్నది ప్రశ్న. అందుకే చాలామంది నిమ్మల రామానాయుడిని ప్రశంసిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 12:34 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…