Political News

వైసీపీకి ర‌ఘురామ మ‌రో పంచ్‌..

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. అధికారంలో ఉన్నార‌నే కానీ.. ఆ పార్టీ నేత‌ల‌కు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీనికి ఆపార్టీ నేత‌లు చేసుకుంటున్న నిర్వాక‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంది క‌దా.. అని నోటికి అడ్డు అదుపు లేకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు.. దూష‌ణ‌లు.. అనుచిత కామెంట్లు.. వంటివి ఆ పార్టీ కీల‌క నేత‌ల‌ను పోలీస్ స్టేష‌న్ల బాట ప‌ట్టిస్తున్నాయి. కోర్టుల్లో కేసులు న‌మోద‌య్యేలా చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లుచేశార‌నే ఫిర్యాదుల‌తో ఎంపీ.. నందిగం సురేష్ స‌హా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంటి వారిపై కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం వీటిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఇదిలావుంటే..ఇ ప్పుడు మ‌రో సంక‌టం వ‌చ్చి ప‌డింది. వైసీపీ ఎన్నారై విభాగం నేత‌, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న పంచ్ ప్ర‌భాక‌ర్‌పై ఏకంగా డిల్లీ ప్ర‌త్యేక విభాగం పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైసీపీని వ్య‌తిరేకించేవారిని.. ముఖ్యంగా ఆపార్టీ త‌ర‌ఫున గెలిచి.. ఆ పార్టీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న ఎంపీ ర‌ఘురామ‌పై పంచ్‌ప్ర‌భాక‌ర్ కొన్నాళ్లుగా దూష‌ణ‌ల ప‌ర్వానికి తెర‌దీశారు. అంతేకాదు.. వీటిని యూట్యూబుల్లో పెట్టి.. తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఎంపీ ర‌ఘురామ కొన్నాళ్ల కింద‌ట హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా(ర‌ఘురామ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను పెండింగులో పెట్ట‌డంపై)ల‌ను కూడా పంచ్ ప్ర‌భాక‌ర్ దూషించారు.

ఈ క్ర‌మంలో ఆయా అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఎంపీ ర‌ఘురామ‌.. ఢిల్లీలో ని ప్ర‌త్యేక విభాగం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఆధారాల‌ను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు.దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతి తీసుకుని పంచ్ ప్రభాకర్‌పై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్‌ అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా.. పలువురు ప్రముఖులపై పంచ్ ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు.

This post was last modified on August 17, 2021 7:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

36 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago