Political News

ఫ‌స్ట్ టైమ్‌: కేసీఆర్ పేషీలోకి ద‌ళిత అధికారి.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌?

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం.. సీఎం కేసీఆర్‌.. కొన్నాళ్లుగా ద‌ళిత జ‌పం చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌ను త‌న ప‌క్షానికి తిప్పుకోవ‌డం.. త‌ను దూరం చేసిన ఈట‌ల రాజేందర్ ను ఘోరంగా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ద‌ళిత బంధు.. ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయ‌ల‌ను అభివృద్ధి కోసం కేటాయించారు. ద‌ళిత వాడ‌ల‌కు వెళ్లి(వాసాల‌మ‌ర్రి) భోజ‌నాలు చేస్తున్నారు. ద‌ళితుల కోసం ఎంతో చేస్తున్నాన‌ని చెబుతున్నారు. ఇలా.. అనేక రూపాల్లో ద‌ళితుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్‌.. అదే క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న చ‌ర్య చేప‌ట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో మొదటిసారిగా ఓ దళిత అధికారి నియమితులు కానున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను రాహుల్‌ బొజ్జాకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ సభలో ప్రకటించారు. ఆయనను సీఎంఓ కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఓ దళిత అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్‌ ప్రస్తుతం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం తనయుడే రాహుల్‌. 2000 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాహుల్‌, గతంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం సీఎంఓలో అధికారులను చూస్తే.. ముఖ్యకార్యదర్శిగా నర్సింగ్‌రావు, కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌(మిషన్‌ భగీరథ), మరో కార్యదర్శిగా వి.శేషాద్రి(రెవెన్యూ), ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి(ఎడ్యుకేషన్‌), మరో ప్రత్యేక కార్యదర్శిగా భూపాల్‌ రెడ్డి(సంక్షేమం) పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంఓలో ఒక్క దళిత అధికారిని నియమించలేదంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో విపక్షాలు, దళిత సంఘాలు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ దళిత సామాజిక వర్గానికి చెందిన రాహుల్‌ బొజ్జాను సీఎంఓలో నియమించ‌డం ద్వారా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. హుజూరాబాద్‌లో విజయం దిశ‌గా దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on August 17, 2021 7:13 pm

Share
Show comments
Published by
Satya
Tags: DalitKCR

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago