Political News

ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే

వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్దితి చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్థితి అంచనా వేసుకున్న కమలం పార్టీ అగ్రనేతలు రాబోయే ఎన్నికలపై బీజేపీ విషయంలో జనాభిప్రాయం సేకరించాలని అనుకున్నారు.

ఇందులో భాగంగానే నమో యాప్ అనే యాప్ ను రెడీచేశారు. దీన్ని పై రాష్ట్రాల్లోని జనాలకు పరిచయం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేయబోతున్న అంశాలు ఏమిటనే విషయాలను జనాల నుండే నేరుగా తెలుసుకోవాలని కమలం పార్టీ అగ్రనేతల డిసైడ్ చేసుకున్నారు. ఓటేసేటప్పుడు ప్రజలు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు ? అనే విషయమై ప్రధానంగా దృష్టి పెట్టింది.

కోవిడ్-19 నియంత్రణ, వ్యాక్సినేషన్ జరిగిన, జరుగుతున్న విధానం, సంక్షేమ పథకాల అమలు, తమ ప్రజాప్రతినిధుల పనితీరు, అవినీతి, అక్రమాలు, ప్రజలతో సంబంధాలు, ఎవరైతే అభ్యర్థిగా బాగుంటుందని అనుకుంటున్నారు, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, శాంతి-భద్రతలు, విద్యావకాశాలు లాంటి అనేక అంశాలపై బీజేపీ గట్టిగా సర్వే చేయించుకుంటోంది. తమకు వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా బహుశా టికెట్లను డిసైడ్ చేయాలని అనుకుందేమో.

ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్ల కమలం పార్టీ గడ్డు పరిస్ధితులనే ఎదుర్కొంటోంది. పంజాబ్ లో ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా పుంజుకున్న సూచనలు కనబడలేదు. కాకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలేమైనా బీజేపీకి కలిసివస్తుందేమో చూడాలి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి దీటుగా ఆప్ పార్టీ చొచ్చుకుపోతోంది.

ఇవి కాకుండా ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన అకాలీదళ్ వల్ల బీజేపీకి కొంత నష్టం జరిగే అవకాశముంది. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకునే హోలు మొత్తంగా ఐదు రాష్ట్రాల్లోను ఎన్నికల సర్వే చేయించుకుంటోంది. మరి ఫలితాలు ఎప్పుడు వస్తాయో ? ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ అయితే కమలనాథుల్లో పెరిగిపోతోంది. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో.

This post was last modified on August 11, 2021 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago