ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియా మొత్తంలో లక్షా 50 వేల దాకా కేసులుంటే.. 50 వేల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొన్నాళ్లుగా రోజూ వంద మందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు.
లాక్ డౌన్ను సమర్థంగా అమలు చేయడంలో, ప్రజల్ని జాగృతం చేయడంలో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పక్కాగా అనుసరించడంలో శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కరోనా ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయికి చేరిందన్న విమర్శలున్నాయి.
పోలీసుల్లోనే వెయ్యి మంది కరోనా బారిన పడ్డారంటే ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టం. దేశంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ధారావి మురికివాడ విషయంలోనూ ముందు జాగ్రత్త లేకపోవడంతో అక్కడ కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఐతే ఈ విషయంలో నింద తమపైకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అందుకు నిదర్శనం. తాము పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో నిర్ణయాధికారం తీసుకునే స్థానంలో ఉన్నామని.. మహారాష్ట్రలో తాము కీలక నిర్ణయాల్లో భాగస్వాములుగా లేమని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ.. ఇప్పుడో పెద్ద ఉపద్రవం వచ్చేసరికి రాహుల్ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే రాహుల్ తరచుగా నోరు జారి ట్రోల్ అవుతుంటాడు. తాజా వ్యాఖ్యలతో మరింతగా విమర్శల పాలవుతున్నాడు. శివసేన నుంచి కూడా అతడి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
This post was last modified on May 26, 2020 7:51 pm
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…