ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియా మొత్తంలో లక్షా 50 వేల దాకా కేసులుంటే.. 50 వేల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొన్నాళ్లుగా రోజూ వంద మందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు.
లాక్ డౌన్ను సమర్థంగా అమలు చేయడంలో, ప్రజల్ని జాగృతం చేయడంలో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పక్కాగా అనుసరించడంలో శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కరోనా ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయికి చేరిందన్న విమర్శలున్నాయి.
పోలీసుల్లోనే వెయ్యి మంది కరోనా బారిన పడ్డారంటే ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టం. దేశంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ధారావి మురికివాడ విషయంలోనూ ముందు జాగ్రత్త లేకపోవడంతో అక్కడ కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఐతే ఈ విషయంలో నింద తమపైకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అందుకు నిదర్శనం. తాము పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో నిర్ణయాధికారం తీసుకునే స్థానంలో ఉన్నామని.. మహారాష్ట్రలో తాము కీలక నిర్ణయాల్లో భాగస్వాములుగా లేమని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ.. ఇప్పుడో పెద్ద ఉపద్రవం వచ్చేసరికి రాహుల్ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే రాహుల్ తరచుగా నోరు జారి ట్రోల్ అవుతుంటాడు. తాజా వ్యాఖ్యలతో మరింతగా విమర్శల పాలవుతున్నాడు. శివసేన నుంచి కూడా అతడి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
This post was last modified on May 26, 2020 7:51 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…