వైఎస్ వివేకానందరెడ్డికి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దొరికినట్లేనా ? సీబీఐ దూకుడు చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. వివేకా హత్య దర్యాప్తును సీబీఐకి ఇచ్చిన తర్వాత కూడా చానాళ్ళు పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే దర్యాప్తు తీరుపై మొదలైన ఆరోపణలు, విమర్శల కారణంగా సీబీఐ అధికారులు జోరుపెంచారు. దాంతో వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు. దీంతో కాస్త డొంక కదిలింది.
కదిలిన డొంక కారణంగా హతుని మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో వ్యక్తి సునీల్ యాదవ్ లాంటివాళ్ళను కూడా అరెస్టు చేశారు. దాంతో హత్యకు వాడిన ఆయుధాల విషయం బయటపడింది. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ చెప్పిన వివరాల కారణంగా ఆయుధాలను పులివెందులకు సమీపంలోని ఓ మురుగు కాలువలో పడేసినట్లు తెలిసింది. దాంతో పులివెందుల మున్సిపాలిటిలోని పారిశుధ్య పనివారిని పిలిపించి మురుగుకాల్వలో వెతుకులాట మొదలుపెట్టటారు.
మురుగుకాల్వ సుమారు 8 అడుగుల లోతుంది. దాంతో ముందు కాల్వలోని మురుగునీటిని బయటకు తోడేయటం మొదలైంది. శనివారమంతా సీబీఐ ఇదే పనిని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తోంది. శనివారం కొంత నీటిని తోడేసినా ఇంకా తీయాల్సిన మురుగునీరు చాలాఉంది. దాంతో ఆదివారం కూడా మురుగునీటిని తోడేసేపని ముమ్మరంగా జరుగబోతోంది. ఆదివారం గనుక ఆయుధాలు బయటపడితే హత్య దర్యాప్తు విషయం చాలా కీలకంగా మారబోతోంది.
ఎలాగంటే హత్యాయుధలపై కచ్చితంగా వేలిముద్రలుంటాయి. దాదాపు రెండేళ్ళక్రితం జరిగిన హత్య కాబట్టి ఇప్పటికీ వేలిముద్రలు గనుక చెరిగిపోకుండా ఉంటే వాటి ఆధారంగా హంతకులను పట్టుకోవటం తేలికవుతుందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదంతా ఆయుధాలపై వేలిముద్రల దొరకటంపైనే ఆధారపడుంటుంది. మొత్తానికి తొందరలోనే వివేకా హత్య మిస్టరీ విడిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.
This post was last modified on August 8, 2021 12:23 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…