దిశ ఎన్ కౌంటర్.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరూ మర్చిపోయి ఉండరు. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా బతికుండగానే తగలపెట్టారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేశారు. కాగా.. తాజాగా ఎన్కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు లో తాజాగా తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తింది. సుప్రీం కోర్టులో దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా.. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు మరో ఆరు నెలలు సమయం కావాలని సుప్రీం ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పదే పదే సమయం ఎందుకు కోరుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారు.. ఇంకా ఎందరిని ప్రశ్నించాలి? అని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ కేసును అతి త్వరలో తేల్చాలని జేఐ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. కాగా దిశ రేప్ కేసులో.. నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రేప్ చేసిన స్థలంలోనే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
This post was last modified on August 3, 2021 5:58 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…