దేశ పరిపాలనను ప్రధాని కనుసన్నల్లోనే జరుగుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. ప్రధానికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ పీఎంవో చూసుకుంటూ ఉంటుంది. అత్యంత కీలకంగా వ్యవహరించే ఈ పీఎంవో(ప్రధాన మంత్రి కార్యాలయం) లో ముసలం మొదలైందంటూ గుసగుసలు వినపడుతున్నాయి. అందుకు.. సాక్ష్యం ఒకే నెలలో ఇద్దరు కీలక వ్యక్తులు రాజీనామా చేయడమే. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్ అధికారి అమర్జీత్ సింగ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను అమర్జీత్ సిన్హా చూస్తున్నారు. 1983 బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అమర్జీత్ సిన్హా … 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు.
అయితే, ఆయన పదవీ కాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గతంలో పీఎంవోలో ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేసిన మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా రాజీనామా చేసిన కొన్ని నెలల్లోనే అమర్జీత్ కూడా అదే బాటపట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే అమర్జీత్ తన రాజీనామాకు కారణాలను మాత్రం పేర్కొనలేదని సమాచారం.
This post was last modified on August 2, 2021 10:56 pm
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…