కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది అనుకునేలోపు.. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. థర్డ్ వేవ్ ప్రమాదం మొదలైనట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు పది రోజులుగా కరోనా కేసులు ప్రతిరోజూ 40వేలకు తగ్గడం లేదు.
వీటిలో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తుండగా.. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో థర్డ్వేవ్ ఎలా ఉండబోతుందన్న అంశంపై నిపుణులు ఒక అధ్యయనం చేపట్టారు. మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటి కాన్పూర్, హైదరాబాద్కు చెందిన మణీంద్ర అగర్వాల్, ఎం.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది.
ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్ విజృంభణ వంటి కారణాలతో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయని, వీటితో థర్డ్ వేవ్ పొంచివుందని అభిప్రాయపడ్డారు. కేసులు క్రమంగా పెరిగి, అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు. ఒక్కరోజులో అత్యధికంగా లక్ష కంటే తక్కువ కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని, పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్ఠంగా 1,50,000గా కూడా ఉండొచ్చని చెప్పారు.
కాగా, సెకండ్ వేవ్లో గరిష్ఠంగా 4లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జీనోమిక్ కన్సార్టియం (INSACOG) నుంచి వెలువడిన వివరాల ప్రకారం.. మే, జూన్, జులై నెలల్లో ప్రతి 10 కేసుల్లో ఎనిమిదింటికి డెల్టా వేరియంటే కారణమని వెల్లడైంది.
మే నెలలో 4,500 పైగా రోజువారీ మరణాలు వెలుగుచూశాయి. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించడంతో వైరస్ దాడిని ఎదుర్కోవచ్చని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
This post was last modified on August 2, 2021 10:55 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…