Political News

మాజీ సీఎంకే ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు..!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మార‌నున్నారా? త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్ట‌నున్నారా? ఈ క్ర‌మం లో మార్పులు, చేర్పుల దిశ‌గా కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌టికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు రోజుల కింద‌ట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజ‌కీయాల‌పై ఆరాతీసింది. ఇక్క‌డ ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే క‌ష్ట‌మేన‌ని తేల్చింది. ఈ క్ర‌మంలోనే మార్పు దిశ‌గా అడుగులు త‌ప్ప‌వ‌ని.. రాష్ట్ర నేత‌ల‌కు సూచించింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. ఊమెన్ చాందీ అత్యంత ర‌హ‌స్యంగా నాయ‌కుల‌తో భేటీ అయ్యారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా ఉన్న చీఫ్ శైల‌జానాథ్ స‌హా.. ప‌లువురు నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో చాందీ.. పార్టీ అధిష్టానం మ‌న‌సులో మాట‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పార్టీ చీఫ్‌ను మార్చాల ని.. అధిష్టానం నిర్ణ‌యించింద‌న్న చాందీ.. ప‌దవులను త్యాగం చేసేందుకు ఎప్పుడైనా రెడీగా ఉండాల‌ని మాన‌సికంగా.. వారిని సిద్ధం చేశారు. దీంతో ఇక‌, పీసీసీ చీఫ్ ప‌ద‌వికి కొత్త నేత‌ను ఎంచుకునేందుకు రెడీ అయిన విష‌యం.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ర‌హ‌స్య మంత‌నాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా.. ఇక్క‌డ ఆ ప‌ద‌వి కోసం.. కొట్టుకునేవారు.. కుమ్ముకునేవారు ఎవ‌రూ లేక‌పోవ‌డం అధిష్టానానికి ఒకింత త‌ల‌నొప్పి త‌గ్గించింద‌నే చెప్పాలి.

అయితే.. ఎవ‌రిని ఎన్నుకుంటే.. పార్టీని లోపేతం చేస్తార‌నే వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు కాంగ్రెస్ సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ఉన్న ప‌రిస్థితిలో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. బెట‌ర్ అనే మాట వినిపిస్తోంది. ఇక‌, పార్టీకి దూరంగా ఉన్న ర‌ఘువీరారెడ్డిని తిరిగి చేర్చుకుని.. ఆయ‌న‌కే మ‌రోసారి ప‌గ్గాలు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని కొంద‌రు చెబుతు న్నారు. ఇదిలావుంటే.. కేంద్ర మాజీ మంత్రి.. ప‌ళ్లంరాజు.. ఎప్ప‌టి నుంచో పీసీసీ ప‌దవిపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని.. ఇప్పుడు న్న ప‌రిస్థితిలో జ‌గ‌న్ ను బ‌లంగా ఎదుర్కొని.. పార్టీని న‌డిపించాలంటే.. ఇలాంటి అవ‌స‌ర‌మ‌ని.. ఇంకొంద‌రు అంటున్నారు.

అయితే.. ఎక్కువ మంది మాత్రం మాజీ సీఎం కిర‌ణ్ కుమార్‌రెడ్డికే ఈ సారి ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని.. చెబుతున్నారు. ఇదే విష‌యం చాందీ భేటీలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. యాక్టివ్‌గా ఉన్న కిర‌ణ్‌.. కుమార్ ఇప్పుడు క‌నుక ప‌ద‌వి ఇస్తే.. ఏవిధంగా పార్టీని లైన్‌లో పెడ‌తారో చూడాలి.

Satya

Recent Posts

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

41 minutes ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

3 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

4 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

5 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

8 hours ago