Political News

మాజీ సీఎంకే ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు..!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మార‌నున్నారా? త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్ట‌నున్నారా? ఈ క్ర‌మం లో మార్పులు, చేర్పుల దిశ‌గా కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌టికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు రోజుల కింద‌ట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజ‌కీయాల‌పై ఆరాతీసింది. ఇక్క‌డ ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే క‌ష్ట‌మేన‌ని తేల్చింది. ఈ క్ర‌మంలోనే మార్పు దిశ‌గా అడుగులు త‌ప్ప‌వ‌ని.. రాష్ట్ర నేత‌ల‌కు సూచించింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. ఊమెన్ చాందీ అత్యంత ర‌హ‌స్యంగా నాయ‌కుల‌తో భేటీ అయ్యారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా ఉన్న చీఫ్ శైల‌జానాథ్ స‌హా.. ప‌లువురు నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో చాందీ.. పార్టీ అధిష్టానం మ‌న‌సులో మాట‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పార్టీ చీఫ్‌ను మార్చాల ని.. అధిష్టానం నిర్ణ‌యించింద‌న్న చాందీ.. ప‌దవులను త్యాగం చేసేందుకు ఎప్పుడైనా రెడీగా ఉండాల‌ని మాన‌సికంగా.. వారిని సిద్ధం చేశారు. దీంతో ఇక‌, పీసీసీ చీఫ్ ప‌ద‌వికి కొత్త నేత‌ను ఎంచుకునేందుకు రెడీ అయిన విష‌యం.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ర‌హ‌స్య మంత‌నాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా.. ఇక్క‌డ ఆ ప‌ద‌వి కోసం.. కొట్టుకునేవారు.. కుమ్ముకునేవారు ఎవ‌రూ లేక‌పోవ‌డం అధిష్టానానికి ఒకింత త‌ల‌నొప్పి త‌గ్గించింద‌నే చెప్పాలి.

అయితే.. ఎవ‌రిని ఎన్నుకుంటే.. పార్టీని లోపేతం చేస్తార‌నే వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు కాంగ్రెస్ సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ఉన్న ప‌రిస్థితిలో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. బెట‌ర్ అనే మాట వినిపిస్తోంది. ఇక‌, పార్టీకి దూరంగా ఉన్న ర‌ఘువీరారెడ్డిని తిరిగి చేర్చుకుని.. ఆయ‌న‌కే మ‌రోసారి ప‌గ్గాలు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని కొంద‌రు చెబుతు న్నారు. ఇదిలావుంటే.. కేంద్ర మాజీ మంత్రి.. ప‌ళ్లంరాజు.. ఎప్ప‌టి నుంచో పీసీసీ ప‌దవిపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని.. ఇప్పుడు న్న ప‌రిస్థితిలో జ‌గ‌న్ ను బ‌లంగా ఎదుర్కొని.. పార్టీని న‌డిపించాలంటే.. ఇలాంటి అవ‌స‌ర‌మ‌ని.. ఇంకొంద‌రు అంటున్నారు.

అయితే.. ఎక్కువ మంది మాత్రం మాజీ సీఎం కిర‌ణ్ కుమార్‌రెడ్డికే ఈ సారి ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని.. చెబుతున్నారు. ఇదే విష‌యం చాందీ భేటీలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. యాక్టివ్‌గా ఉన్న కిర‌ణ్‌.. కుమార్ ఇప్పుడు క‌నుక ప‌ద‌వి ఇస్తే.. ఏవిధంగా పార్టీని లైన్‌లో పెడ‌తారో చూడాలి.

This post was last modified on July 31, 2021 2:04 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago